దర్శకుడు సుకుమార్ కు అతి పెద్ద సమస్యగా మారిన పుష్ప 2 ది రూల్ స్పెషల్ సాంగ్ కు పరిష్కారం దొరికిందని తాజా సమాచారం. యానిమల్ లో కనిపించేది తక్కువ నిడివి అయినా రష్మిక మందన్నతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకున్నట్టు యూనిట్ వర్గాల టాక్. నిజమో కాదో తేలాలంటే షూట్ మొదలయ్యే దాకా చెప్పలేం కానీ విశ్వసనీయంగా వింటున్న ప్రకారం ఇది నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గత రెండు నెలలుగా పైగా సుక్కు టీమ్ కొనసాగిస్తున్న వేట ఎక్కడ రిలీజ్ డేట్ మీద ప్రభావం చూపిస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
ఏదైతేనేం ఫైనల్ గా సొల్యూషన్ దక్కడమే అందరికీ కావాల్సింది. ఒకదశలో దిశా పటానిని కూడా ట్రై చేశారు కానీ పనవ్వలేదు. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావా సమంత ఒలికించిన హొయలకు ధీటుగా ఇప్పుడు త్రిప్తి మెప్పించాల్సి ఉంటుంది. మరి అంత మేజిక్ చేస్తుందో లేదో స్క్రీన్ మీద చూశాకే క్లారిటీ వస్తుంది. ఈ నెల వారం రోజులు మినహాయిస్తే పుష్ప విడుదలకు కేవలం 75 రోజులు మాత్రమే ఉంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, రీ రికార్డింగ్, ప్రమోషన్ ప్లాన్ అన్నీ జరిగిపోవాలి. మలేషియా షెడ్యూల్ ని ఫిలిం సిటీలో సెట్ వేసి కానిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత టైట్ గా ఉందో.
ఇప్పటికే ఒక ఆడియో సాంగ్ రిలీజ్ చేసిన పుష్ప బృందం ఈ నెల 29న అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య వచ్చే మెలోడీ డ్యూయెట్ ని విడుదల చేయనుంది. ఆడియో పరంగా దేవిశ్రీ ప్రసాద్ అంచనాలు నిలబెట్టుకుంటాడనే అభిమానుల్లో బలంగా ఉంది. బిజినెస్ క్రేజ్ మోస్తున్న పుష్ప 2 థియేట్రికల్ డీల్స్ ని ఇంకా క్లోజ్ చేయలేదు. పూర్తి స్థాయి టీజర్ వచ్చాక లెక్కలు మారతాయనే ధీమాలో నిర్మాతలున్నట్టు కనిపిస్తోంది. కల్కి 2898 ఏడి, భారతీయుడు 2 తర్వాత మళ్ళీ అంతకు మించిన స్థాయిలో బాక్సాఫీస్ కు ఊపు తెచ్చే సినిమాగా పుష్ప 2 మీదున్న హైప్ కి ఆకాశమే హద్దుగా నిలుస్తోంది.
This post was last modified on May 23, 2024 1:28 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…