కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న నటుడంటే ఉపేంద్రనే. ‘ఉపేంద్ర’, ‘ఎ’, ‘రా’ లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడతను. ఆ తర్వాత తెలుగులోనూ నేరుగా ‘కన్యాదానం’ లాంటి కొన్ని సినిమాల్లో నటించాడు. ఐతే ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నటించలేదు. అతడి డబ్బింగ్ సినిమాల సందడి కూడా తగ్గిపోయింది.
చాలా ఏళ్ల విరామం తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో అతను తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో బాగానే మెరిశాడు. ఐతే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉపేంద్ర మళ్లీ ఇటు చూడలేదు. మళ్లీ గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాతోనే తెలుగులోకీ రీరీఎంట్రీ ఇవ్వనున్నాడు.
మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో ఉపేంద్ర నటిస్తాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఈ రోజు ధ్రువీకరణ అయింది. శుక్రవారం ఉపేంద్ర పుట్టిన రోజు కాగా.. వరుణ్ కొత్త సినిమా బృందం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ చిత్రంలో ఉప్పి ఉన్నాడన్న సంగతి కన్ఫమ్ చేసింది.
కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. వేసవిలోనే ఈ సినిమా మొదలై, ఈపాటికి పూర్తి కావాల్సింది కానీ.. కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ ఖాళీలో వరుణ్ మరింతగా బాక్సింగ్ సాధన చేశాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు. వరుణ్ కటౌట్కు బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అంటే భలేగా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ కథానాయికగా నటించనుందట. అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ (బాబీ) సొంతంగా నిర్మించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
This post was last modified on September 18, 2020 3:48 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…