కన్నడ సినీ పరిశ్రమలో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న నటుడంటే ఉపేంద్రనే. ‘ఉపేంద్ర’, ‘ఎ’, ‘రా’ లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడతను. ఆ తర్వాత తెలుగులోనూ నేరుగా ‘కన్యాదానం’ లాంటి కొన్ని సినిమాల్లో నటించాడు. ఐతే ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నటించలేదు. అతడి డబ్బింగ్ సినిమాల సందడి కూడా తగ్గిపోయింది.
చాలా ఏళ్ల విరామం తర్వాత అల్లు అర్జున్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో అతను తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో బాగానే మెరిశాడు. ఐతే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉపేంద్ర మళ్లీ ఇటు చూడలేదు. మళ్లీ గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర.. ఇప్పుడు మరో మెగా హీరో సినిమాతోనే తెలుగులోకీ రీరీఎంట్రీ ఇవ్వనున్నాడు.
మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కొత్త చిత్రంలో ఉపేంద్ర నటిస్తాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఈ రోజు ధ్రువీకరణ అయింది. శుక్రవారం ఉపేంద్ర పుట్టిన రోజు కాగా.. వరుణ్ కొత్త సినిమా బృందం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ చిత్రంలో ఉప్పి ఉన్నాడన్న సంగతి కన్ఫమ్ చేసింది.
కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. వేసవిలోనే ఈ సినిమా మొదలై, ఈపాటికి పూర్తి కావాల్సింది కానీ.. కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈ ఖాళీలో వరుణ్ మరింతగా బాక్సింగ్ సాధన చేశాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు. వరుణ్ కటౌట్కు బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అంటే భలేగా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ భామ నభా నటేష్ కథానాయికగా నటించనుందట. అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ (బాబీ) సొంతంగా నిర్మించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
This post was last modified on September 18, 2020 3:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…