మాములుగా తన ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా రిలీజ్ కు ముందు నిర్మాత దిల్ రాజు చేసే ప్రమోషన్లు మాములుగా ఉండవు. అయితే ఈ శనివారం మే 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్, చెప్పిన మాటలు అన్నీ రిజల్ట్ వచ్చాక నీరుగారిపోయాయి. యావరేజ్ అయినా ఫీలయ్యేవారు కాదేమో కానీ మరీ దారుణంగా ఫ్లాప్ కావడం ఊహించలేదు. అందుకే లవ్ మీ కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే సక్సెస్ అయ్యాక మాట్లాడాలని నిర్ణయించుకున్నారు కాబోలు.
లవ్ మీ తీసిన ఆయన కూతురే అయినప్పటికీ నిర్మాణ తదితర వ్యవహారాలన్నీ రాజుగారే దగ్గరుండి చూసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ దీంతో తెరుచుకుంటాయని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. దిల్ రాజు మాత్రం రాజకీయ నాయకులకు జూన్ 4 ఎలాగో మాకు మే 25 అలా అని టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇవాళ మహేష్ బాబుతో ఎక్స్ వేదికగా ఓ పాటను రిలీజ్ చేయించారు. కీరవాణి సంగీతం ఆశించిన స్థాయిలో బజ్ తేలేకపోవడం లవ్ మీకి ప్రతికూలంగా మారింది. పైగా వైష్ణవి చైతన్య బ్రాండ్ కూడా ఏమంత పని చేయడం లేదు.
ఇవన్నీ గమనిస్తే మొదటి రోజు షోలయ్యాక పబ్లిక్ టాక్, రివ్యూలు చూశాకే దిల్ రాజు దీని గురించి స్పీడ్ పెంచుతారని అనుకోవచ్చు. గత ఏడాది బలగంకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మధ్య హారర్ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువే వచ్చాయి. మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష, ఓం భీం బుష్, మంగళవారం, గీతాంజలి మళ్ళీ వచ్చింది ఇలా చెప్పుకోదగ్గ కౌంట్ లోనే బాక్సాఫీస్ ని పలకరించాయి. వీటిలో వర్కౌట్ అయినవే ఎక్కువ. మరి దెయ్యాన్ని ప్రేమించే పాయింట్ తో వచ్చిన లవ్ మీ ఇఫ్ యు కెన్ ఏ క్యాటగిరీలో వస్తుందో చూడాలి.
This post was last modified on May 22, 2024 1:52 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…