గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో రీమేక్ చేసే స్థాయికి తీసుకెళ్లింది. అప్పటిదాకా షార్ట్ ఫిలింస్, సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన వైష్ణవి చైతన్యకు ఒక్కసారిగా ఈ టైటిల్ రోల్ పోషించినందుకు చాలా పేరొచ్చింది.
అమాయకత్వం ముసుగులో ప్రేమించి దగాపడే అమ్మాయిగా తన పెర్ఫార్మన్స్ ఏ కోణంలోనూ తక్కువ చేసి చూడలేం. సహజంగానే ఇంత భారీ విజయం దక్కినప్పుడు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడతాయి. వాటిలో భాగంగానే దిల్ రాజు ఫ్యామిలీ నిర్మాణంలో వస్తున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ అవకాశం దక్కించుకుంది.
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న లవ్ మీ మీద ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ వగైరాలు చేశారు కానీ హీరో ఆశిష్ కు ఇమేజ్ లేకపోవడం, హారర్ జానర్లో ఏదో ప్రయోగాత్మకంగా ట్రై చేయడం లాంటివి అంచనాలు పెంచలేకపోయాయి.
ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన సంగీతం లవ్ మీ మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడం అసలు దెబ్బ. సరే ఇదంతా పక్కన పెడితే వైష్ణవి చైతన్యకి బేబీ ద్వారా వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పుడీ లవ్ మీకి పెద్దగా ఉపయోగపడకపోవడం విచిత్రమే.
ఇది హిట్ అయితే సంతోషమే కానీ దెయ్యాన్ని ప్రేమించే యువకుడి చుట్టూ తిరిగే పాయింట్ తో రూపొందిన లవ్ మీలో వైష్ణవికి ఎంత మేరకు స్కోప్ దక్కిందో 25న థియేటర్లలో చూస్తే తప్ప క్లారిటీ రాదు.
సిద్దు జొన్నలగడ్డతో జాక్ రూపంలో జాక్ పాట్ కొట్టిన వైష్ణవి చైతన్యకి అది కనక హిట్ అయితే టాప్ లీగ్ వైపు మెల్లగా అడుగులు వేయొచ్చు. శ్రీలీల జోరు తగ్గిపోయి, పూజా హెగ్డే ముంబైకి పరిమితమై, రష్మిక మందన్న డేట్లు దొరకని పరిస్థితుల్లో వైష్ణవి చైతన్య లాంటి వాళ్లకు కెరీర్ నిర్మించుకోవడానికి ఇది మంచి అవకాశం. కాకపోతే వరస సక్సెస్ లు పలకరిస్తూ ఉండాలి. మరి లవ్ మీ ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2024 9:29 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…