నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొన్న సోషల్ మీడియాలో వేసిన పోస్ట్ సంచలనం రేపడం చూశాం. ఆమె ఆవేదన చూసి నిజమే కాబోలు, ఇలా కూడా టార్గెట్ చేస్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధికారికంగా జారీ చేసిన నోటీస్ లో పలు విషయాలను కూలంకుషంగా వివరించడంతో అసలు ట్విస్టులు వెలుగు చూశాయి. పారితోషికంలో బాకీ ఉన్న ఆరు లక్షలు చెల్లించేందుకు నిర్మాత సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెనే సుముఖంగా లేదనే విషయం బయట పడింది.
ఆ మొత్తాన్ని కౌన్సిల్ దగ్గరే జమచేసిన ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ప్రణ్ దీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాతల సమాఖ్య ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. అగ్రిమెంట్ ప్రకారం యాభై రోజులు పని చేయాల్సిన పాయల్ ను నలభై ఏడు రోజులకే టీమ్ వినియోగించుకుంది. క్లాజ్ 16 మేరకు షూట్ అయ్యాక ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన బాధ్యత ఆమెకు ఉందని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావించారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ లో తనకు సభ్యత్వం లేని సంగతి కూడా ఇటీవలే తెలిసిందట. పాయల్ మేనేజర్ సౌరభ్ సరైన రీతిలో స్పందించకపోవడం గురించి నోట్లో వివరించారు.
నాలుగేళ్ల పాత సినిమా కాబట్టి తాను ఏమి చేయనని చెప్పడం సమంజసం కాదనేది కౌన్సిల్ నుంచి చెబుతున్న మాట. నిజమే. కారణాలు ఏమైనా ప్రాజెక్ట్ ఆలస్యమైనప్పుడు రిలీజ్ టైంకి సహకరించడం అందరి బాధ్యత. పైగా కోవిడ్ సమయంలో ఎన్నో కష్టనష్టాలు భరించి రక్షణను పూర్తి చేశామని ప్రణ్ ధీప్ చెప్పుకొచ్చారు. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇలా సామజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వాస్తవాలు దాచి చెప్పడం పట్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంత స్పష్టంగా నిజానిజాలు కనిపిస్తున్న ఇష్యూలో పాయల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2024 11:01 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…