అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 ఆరు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఐపీఎల్ కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కాన్వాస్ ని మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడో ట్విస్టు ఉంది.
భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై ఆరు నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి . ఇదంతా ఓకే కానీ మరి గేమ్ ఛేంజర్ సంగతేంటంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.
దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇండియన్ రెండు భాగాలు సమాంతరంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీసినట్టు అయ్యింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికీ వాయిదాలు తప్పలేదు.
సరే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేసుంటే ఈపాటికి రిలీజైపోయి ఓటిటి ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీలవ్వడంలో అర్థముంది.
ఇదంతా ఒకే కానీ భారతీయుడుకి ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పబ్లిసిటీలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…