అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 ఆరు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఐపీఎల్ కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కాన్వాస్ ని మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడో ట్విస్టు ఉంది.
భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై ఆరు నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి . ఇదంతా ఓకే కానీ మరి గేమ్ ఛేంజర్ సంగతేంటంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.
దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇండియన్ రెండు భాగాలు సమాంతరంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీసినట్టు అయ్యింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికీ వాయిదాలు తప్పలేదు.
సరే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేసుంటే ఈపాటికి రిలీజైపోయి ఓటిటి ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీలవ్వడంలో అర్థముంది.
ఇదంతా ఒకే కానీ భారతీయుడుకి ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పబ్లిసిటీలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on May 19, 2024 8:26 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…