అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 ఆరు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఐపీఎల్ కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కాన్వాస్ ని మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడో ట్విస్టు ఉంది.
భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై ఆరు నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి . ఇదంతా ఓకే కానీ మరి గేమ్ ఛేంజర్ సంగతేంటంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.
దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇండియన్ రెండు భాగాలు సమాంతరంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీసినట్టు అయ్యింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికీ వాయిదాలు తప్పలేదు.
సరే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేసుంటే ఈపాటికి రిలీజైపోయి ఓటిటి ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీలవ్వడంలో అర్థముంది.
ఇదంతా ఒకే కానీ భారతీయుడుకి ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పబ్లిసిటీలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on May 19, 2024 8:26 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…