అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో థర్డ్ పార్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సీక్వెల్ జూలైలో విడుదలకు సిద్ధం కానుండగా భారతీయుడు 3 ఆరు నెలల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఐపీఎల్ కు విచ్చేసిన సందర్భంలో చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. దర్శకుడు శంకర్ ఇంత పెద్ద కాన్వాస్ ని మూడు గంటల్లో చెప్పడం అసాధ్యమని గుర్తించడం వల్లే ఒప్పుకున్నానని కమల్ చెప్పడం గమనార్హం. ఇక్కడో ట్విస్టు ఉంది.
భారతీయుడు 2 జూలైలో వచ్చి ఆపై ఆరు నెలల గ్యాప్ అంటే భారతీయుడు 3 సరిగ్గా జనవరిలో సంక్రాంతికి రావాలి. అంటే మన దగ్గర చిరంజీవి, వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో క్లాష్ అవ్వడానికి సిద్ధపడాలి . ఇదంతా ఓకే కానీ మరి గేమ్ ఛేంజర్ సంగతేంటంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం లేదు.
దీని విషయంలో విపరీతమైన జాప్యం ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇండియన్ రెండు భాగాలు సమాంతరంగా షూట్ చేయడం వల్ల శంకర్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి తీసినట్టు అయ్యింది. అందుకే కమల్, రామ్ చరణ్ ఇద్దరికీ వాయిదాలు తప్పలేదు.
సరే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేసిందని ఆనందపడుతున్నా భారతీయుడు 2 డేట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదన్న సంగతి మర్చిపోకూడదు. సో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చాక కానీ చెప్పలేం. ఒకవేళ శంకర్ కేవలం రామ్ చరణ్ ది మాత్రమే చేసుంటే ఈపాటికి రిలీజైపోయి ఓటిటి ప్రీమియర్ కూడా ఎప్పుడో అయిపోయేదని మెగా ఫ్యాన్స్ ఫీలవ్వడంలో అర్థముంది.
ఇదంతా ఒకే కానీ భారతీయుడుకి ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో కమల్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పబ్లిసిటీలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
This post was last modified on May 19, 2024 8:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…