యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేయడం చూశాం.
అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక అడుగు ముందుకేసి ఆ సినిమాలో నటించినందుకు ఫీలవుతున్నానని చెప్పడం సోషల్ మీడియాలో ఇష్యూ అయ్యింది.
జావేద్ అక్తర్, కిరణ్ రావు తదితర ప్రముఖులు చేసిన నెగటివ్ కామెంట్స్ ని సందీప్ వంగా సమర్ధవంతంగా తిప్పి కొట్టాడు. అఫ్కోర్స్ కరణ్ జోహార్ లాంటి వాళ్ళు యానిమల్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు లేకపోలేదు. ఇదంతా చెప్పడానికి కారణముంది.
ఇటీవలే భారీ తారాగణంతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన హీరామండి వెబ్ సిరీస్ కు మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి కానీ కంటెంట్ గురించి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇలాంటిది ఆశించలేదని, ఆయన స్థాయి పనితనం కాదని చెప్పిన వాళ్లే ఎక్కువ. రివ్యూస్ సైతం మాస్టర్ పీస్ అని పొగడలేదు.
స్వాతంత్రం రాకముందు పాకిస్థాన్ లో ఉండే ఒక వేశ్యవాటిక చుట్టూ నడిపిన కథని భన్సాలీ పెద్ద క్యాస్టింగ్ తో తెరకెక్కించాడు. అయితే అభ్యంతరం అనిపించే సీన్లు, ఇంటిమసీ ఎపిసోడ్లు ఇందులో లేకపోలేదు. కానీ ఎవరూ వేలెత్తి చూపలేదు.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భన్సాలీ మాట్లాడుతూ తనకు రేషన్ షాపులో నిలబడి బియ్యం చెక్కర తీసుకునే మహిళలు ఎలాంటి స్ఫూర్తి ఇవ్వరని, అదే ఒక వేశ్య జీవితంలో ఎంతో మిస్టరీ ఉంటుందని అందుకే వాళ్ళ కథలు చెప్పేందుకు ఇష్టపడతానని చెప్పడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మిడిల్ క్లాస్ జీవితాలు చప్పగా ఉంటాయని చెప్పడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శ్యామ్ బెనెగల్ తీసిన క్లాసిక్స్ నుంచి ఇప్పటి లాపతా లేడీస్ దాకా ఉదాహరణలు చెబుతున్నారు. సందీప్ వంగా ఏదైనా అంటేనే ఇంతెత్తున లేచే కొన్ని వర్గాలు భన్సాలీకి మాత్రం మౌనంగా మినహాయింపు ఇచ్చాయి.
This post was last modified on May 19, 2024 6:48 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…