ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదనేది స్పష్టం. ప్రమోషన్లలో ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు మైత్రి మేకర్స్. దీని మీదున్న క్రేజ్ చూసి పోటీ వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అజయ్ దేవగన్ సింగం అగైన్ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది కానీ నిజానికి క్లాష్ అయితే వచ్చే నష్టం తనకేనని తెలుసు కాబట్టే డ్రాప్ అయ్యిందనేది బహిరంగ రహస్యం. పైగా నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప మేనియా మాములుగా లేదు. కానీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం పుష్ప 2ని ఢీ కొడతానని అంటున్నారు.
ఈయన హీరోగా భైరతి రణగల్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మఫ్టీకి కొనసాగింపు. గతంలో ఇక్కడ రీమేక్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు కథలు చెప్పి ఒప్పించలేకపోయిన నర్తన్ దీనికి దర్శకుడు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆగస్ట్ 15. మరి పుష్ప 2తో తలపడటం రిస్క్ కదాని మేకర్స్ ని అడిగితే తమ కంటెంట్ మీద నమ్మకం ఉందని, ఇతర బాషా చిత్రాల కోసం రాజీ పడే సమస్యే లేదని అంటున్నారు. అంతే కాదు మల్టీ లాంగ్వేజ్ విడుదలకు ప్లాన్ చేస్తామని కుండ బద్దలు కొట్టేశారు.
ఇంత ధైర్యంగా ఉండేందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది డిసెంబర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కాటేరా ఆ తాకిడిని తట్టుకుని శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో దర్శన్ ప్రెస్ మీట్ లో చూపించిన కాన్ఫిడెన్స్ నిజమయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ నేరు అదే సమయంలో వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2తోనూ తమకు అలాంటి ఫలితమే వస్తుందనే ధీమా భైరతి రణగల్ మేకర్స్ లో కనిపిస్తోంది. సప్తసాగారాలు దాటి సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా కెజిఎఫ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. తెలుగు డబ్ కూడా చేస్తారు.
This post was last modified on May 19, 2024 12:45 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…