ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదనేది స్పష్టం. ప్రమోషన్లలో ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు మైత్రి మేకర్స్. దీని మీదున్న క్రేజ్ చూసి పోటీ వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అజయ్ దేవగన్ సింగం అగైన్ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది కానీ నిజానికి క్లాష్ అయితే వచ్చే నష్టం తనకేనని తెలుసు కాబట్టే డ్రాప్ అయ్యిందనేది బహిరంగ రహస్యం. పైగా నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప మేనియా మాములుగా లేదు. కానీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం పుష్ప 2ని ఢీ కొడతానని అంటున్నారు.
ఈయన హీరోగా భైరతి రణగల్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ మఫ్టీకి కొనసాగింపు. గతంలో ఇక్కడ రీమేక్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు కథలు చెప్పి ఒప్పించలేకపోయిన నర్తన్ దీనికి దర్శకుడు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆగస్ట్ 15. మరి పుష్ప 2తో తలపడటం రిస్క్ కదాని మేకర్స్ ని అడిగితే తమ కంటెంట్ మీద నమ్మకం ఉందని, ఇతర బాషా చిత్రాల కోసం రాజీ పడే సమస్యే లేదని అంటున్నారు. అంతే కాదు మల్టీ లాంగ్వేజ్ విడుదలకు ప్లాన్ చేస్తామని కుండ బద్దలు కొట్టేశారు.
ఇంత ధైర్యంగా ఉండేందుకు కారణం లేకపోలేదు. గత ఏడాది డిసెంబర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కాటేరా ఆ తాకిడిని తట్టుకుని శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో దర్శన్ ప్రెస్ మీట్ లో చూపించిన కాన్ఫిడెన్స్ నిజమయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ నేరు అదే సమయంలో వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప 2తోనూ తమకు అలాంటి ఫలితమే వస్తుందనే ధీమా భైరతి రణగల్ మేకర్స్ లో కనిపిస్తోంది. సప్తసాగారాలు దాటి సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా కెజిఎఫ్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. తెలుగు డబ్ కూడా చేస్తారు.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…