Movie News

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి స్థాయి ప్రకటనే రాలేదు. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు అధికారికంగా కన్ఫర్మ్ అయినా ఎప్పుడు ఉంటుంది, క్యాస్టింగ్, సాంకేతిక వర్గం తదితర వివరాలు బయట పెట్టలేదు. త్రివిక్రమ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ వెంటనే త్రివిక్రమ్ సెట్లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అట్లీ లేదా పుష్ప 3 వీటిలో ఒకటి ఉంటుంది.

అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకని త్రివిక్రమ్ ఈలోగా అఆ తరహాలో ఒక కూల్ ఎంటర్ టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఎనర్జిటిక్ రామ్ తో ఒక సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిశోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్ కు నువ్వే నువ్వే రూపంలో మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆ కృతజ్ఞత మాటల మాంత్రికుడికి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్ట్ ని సురేష్ బాబు కంటే ఎక్కువ నమ్మింది రవికిషోరే. అందుకే రామ్ కాంబోలో ఒక మూవీ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ సాధ్యపడలేదు.

ఇకవేళ త్రివిక్రమ్ సానుకూలంగా స్పందిస్తే రామ్ తో ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కథ పరంగా ఇబ్బంది లేదట. రెడీగానే ఉందని, కాకపోతే వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లతో చేసి ఇప్పుడు టయర్ 2 హీరోలతో జట్టు కట్టడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఏదీ అడగాలన్నా త్రివిక్రమ్ ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు. పోనీ ఏదైనా ఈవెంట్ కి వస్తే అడుగుదామంటే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. మరి పూర్తిగా అల్లు అర్జున్ సినిమా మీదే దృష్టి పెడతారా లేక నితిన్ కి హిట్ ఇచ్చినట్టు రామ్ కి బ్రేక్ దక్కడం కోసం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

This post was last modified on May 18, 2024 1:32 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

4 hours ago