గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి స్థాయి ప్రకటనే రాలేదు. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు అధికారికంగా కన్ఫర్మ్ అయినా ఎప్పుడు ఉంటుంది, క్యాస్టింగ్, సాంకేతిక వర్గం తదితర వివరాలు బయట పెట్టలేదు. త్రివిక్రమ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో స్క్రిప్ట్ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని సిద్ధం చేస్తున్నారని టాక్. అయితే పుష్ప 2 ది రూల్ రిలీజయ్యాక బన్నీ వెంటనే త్రివిక్రమ్ సెట్లో అడుగు పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అట్లీ లేదా పుష్ప 3 వీటిలో ఒకటి ఉంటుంది.
అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకని త్రివిక్రమ్ ఈలోగా అఆ తరహాలో ఒక కూల్ ఎంటర్ టైనర్ తీసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఎనర్జిటిక్ రామ్ తో ఒక సినిమా చేయించాలని నిర్మాత స్రవంతి రవికిశోర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా త్రివిక్రమ్ కు నువ్వే నువ్వే రూపంలో మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆ కృతజ్ఞత మాటల మాంత్రికుడికి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ స్క్రిప్ట్ ని సురేష్ బాబు కంటే ఎక్కువ నమ్మింది రవికిషోరే. అందుకే రామ్ కాంబోలో ఒక మూవీ చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ సాధ్యపడలేదు.
ఇకవేళ త్రివిక్రమ్ సానుకూలంగా స్పందిస్తే రామ్ తో ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కథ పరంగా ఇబ్బంది లేదట. రెడీగానే ఉందని, కాకపోతే వందల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్లతో చేసి ఇప్పుడు టయర్ 2 హీరోలతో జట్టు కట్టడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఏదీ అడగాలన్నా త్రివిక్రమ్ ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు. పోనీ ఏదైనా ఈవెంట్ కి వస్తే అడుగుదామంటే ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. మరి పూర్తిగా అల్లు అర్జున్ సినిమా మీదే దృష్టి పెడతారా లేక నితిన్ కి హిట్ ఇచ్చినట్టు రామ్ కి బ్రేక్ దక్కడం కోసం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on May 18, 2024 1:32 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…