ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వగైరాలు. ఒకప్పుడు ఎస్విసిని ఇంతే స్పీడ్ తో పరుగులు పెట్టించిన దిల్ రాజు ఈ మధ్య నెమ్మదించారని అనుకుంటారు కానీ వాస్తవానికి ఆయన కమిట్ మెంట్లు చూస్తే పైన చెప్పిన వాళ్ళ కన్నా ఎక్కువగా అనిపిస్తాయి. అదెలాగో చూద్దాం. ఈ నెల ఇరవై అయిదున విడుదల కాబోతున్న ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ కూతురి ప్రొడక్షనే అయినా మొత్తం దగ్గరుండి నాన్నే చూసుకుంటున్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి తెలిసిందే. నితిన్ ‘తమ్ముడు’ సగానికి పైగానే పూర్తయ్యింది.
న్యాచురల్ స్టార్ నాని బలగం వేణు కాంబో ‘ఎల్లమ్మ’ లాక్ అయిపోయింది. పూజా లాంఛనాల రోజు అధికారికంగా ప్రకటిస్తారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా సెట్స్ పైకి వెళ్లాల్సినవి ఏంటో చూద్దాం. ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టరైనా పరశురామ్ కి ఇంకో ఆఫర్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు. వెంకటేష్ – అనిల్ రావిపూడిల కాంబో జూన్ నుంచి షూటింగ్ వెళ్లొచ్చు. షాహిద్ కపూర్ – వంశీ పైడిపల్లి కాంబోతో బాలీవుడ్ లో జెండా పాతాలని దిల్ రాజు బలంగా ప్లాన్ చేసుకున్నారు. సుహాస్ హీరోగా సందీప్ బండ్లతో ఓ ప్రాజెక్టు చర్చల తుది దశలో ఉంది.
ఎప్పటినుంచో బాలకృష్ణతో చేయాలనుకున్న మూవీ త్వరలో సాధ్యం కావొచ్చు. రవితేజ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు కానీ కాంబో సెట్ అవ్వాలి. హిట్ సిరీస్ శైలేష్ కొలను కథకు హీరో దొరికితే పట్టాలు ఎక్కొచ్చట. ధనుష్ – శ్రీకారం కిషోర్ రెడ్డిల కలయికకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. శతమానం భవతి నెక్స్ట్ పేజీని ఆశిష్ తో తెరకెక్కించాలని దిల్ రాజు ఆలోచన. సిద్దు జొన్నలగడ్డతో ఒకటి పెండింగ్ ఉంది. దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, శ్రీకాంత్ అడ్డాల తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త దర్శకుడితో వెంకటేష్ హీరోగా మరో ప్రతిపాదన ఉంది. ఇవన్నీ రెండు మూడేళ్ళలో దాదాపుగా తెరకెక్కేవే.
This post was last modified on May 17, 2024 2:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…