స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా టైం నుంచి కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటే చాలు భారీ మొత్తాలను కళ్ళు మూసుకుని ఆఫర్ చేసిన ఓటిటి సంస్థలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయడమే కాక బేరాల విషయంలో కఠినంగా ఉండటంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ హీరో సినిమాను ఒక పెద్ద ఓటిటికి అమ్మడం కోసం సదరు ప్రొడ్యూసర్ తన బ్యానర్ పలుకుబడిని ఉపయోగిస్తే తప్ప మంచి రేట్ రాలేదు. కారణం ఆ హీరో హ్యాట్రిక్ డిజాస్టర్స్ లో ఉండటమే.
ఇంకో హీరోకు గత రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో నిర్మాణంలో ఉన్న సూపర్ హిట్ సీక్వెల్ పై దాని ప్రభావం పడి కోరుకున్న ధరను ఓటిటిలు ఆఫర్ చేయలేదు. ఆ డబ్బులతో బ్యాలన్స్ షూటింగ్ మేనేజ్ చేద్దామనుకున్న నిర్మాత కం దర్శకుడు ఈ దెబ్బకు నెలల పాటు చిత్రీకరణ ఆపేయాల్సి వచ్చింది. ఆ డైరెక్టర్ ముందు మూవీ ఘోరమైన ఫెయిల్యూర్ కావడం ఇంకో కారణం. దీని వల్ల ట్రేడ్ నుంచి ఆశించిన స్థాయిలో అడ్వాన్సులు అందలేదు. చివరికి ఎదురు చూపులు ఫలించి ఒక మంచి మొత్తమే డిజిటల్ రూపంలో సెటిల్ కావడంతో ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. గుడ్డిగా ఓటిటిని నమ్ముకుని ప్రొడక్షన్ కాస్ట్ ని ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. డిజిటల్ హక్కుల వ్యవహారం తేలకపోవడం వల్లే చాలా టయర్ 2 హీరోల సినిమాల విడుదల తేదీలు ప్రకటించలేకపోతున్నారు. ఇలా జరగడం వల్ల పెట్టుబడి మీద వడ్డీల భారం పెరగడంతో పాటు సరైన రిలీజ్ డేట్ దొరక్క ఇంకో రకం అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం కాంబినేషన్ క్రేజ్ తో మీడియం రేంజ్ హీరోల బిజినెస్ జరగడం లేదు. ఇకపై అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఇకపై కూడా తప్పవు.
This post was last modified on May 19, 2024 12:33 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…