ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇవాళ రామ్ పుట్టినరోజు సందర్బంగా వదలబోయే టీజర్ మీద అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. బ్లాక్ బస్టర్ సీక్వెల్ కావడంతో బిజినెస్ పరంగానూ చాలా డిమాండ్ ఉంది. ది వారియర్, స్కంద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రామ్ ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పూరికి లైగర్ రూపంలో తనకెదురైన సవాల్ కి బదులు చెప్పే బాధ్యత కూడా డబుల్ ఇస్మార్ట్ మీద ఉంది. వీడియో చిన్నదే అయినా మ్యాటర్ గట్టిగానే ఉంది.
దిమాక్ ఖరాబ్ అయితే శంకర్ (రామ్ ) చేసే విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో మొదటి భాగంలో చూపించింది శాంపిల్ మాత్రమే అనే రీతిలో డబుల్ ఇస్మార్ట్ లో క్రేజీ కంటెంట్ కనిపిస్తోంది. ఈసారి శక్తివంతమైన కొత్త డాన్ (సంజయ్ దత్ ) తోడవ్వడంతో అరాచకం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది . మెదడులో చిప్ పెట్టే ట్రాక్ ఇందులోనూ ఉంది కానీ దాని ద్వారా జరిగే పరిణామాలను వయోలెన్స్ డోస్ పెంచడం వెరైటీగా ఉంది. టైటిల్ కి తగ్గట్టే రామ్ డబుల్ జోష్ తో తెలంగాణ స్లాంగ్ తో మరోసారి అదరగొట్టాడు. సంజయ్ దత్ లుక్స్, బిల్డప్ కొత్తగా ఉన్నాయి.
విజువల్స్ లో మంచి మాస్ యాక్షన్ దట్టించారు పూరి జగన్నాథ్. హీరోయిన్ కావ్య తాపర్ ఉన్న తక్కువ స్పేస్ లో ఉనికిని చాటుకుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె నాయుడు – గియాని ఛాయగ్రహణం టెక్నికల్ గా దన్నుగా నిలబడ్డాయి. ఇస్మార్ట్ శంకర్ కొనసాగింపుగా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్ని అందుకునే ప్రయత్నం పూరి చేసినట్టు క్లారిటీ వచ్చేసింది. విడుదల తేదీ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి హైప్ విషయంలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ డ్యూటీ కరెక్ట్ గానే చేసాడు. దీన్ని నిలబెట్టుకుంటే చాలు ఇంకో హిట్టు ఖాతాలో పడ్డట్టే.
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…