కారణాలు ఏమైనా గ్యాంగ్స్ అఫ్ గోదావరి మే 17 నుంచి వాయిదా వేసుకుని మే 31 వెళ్లిపోవడం మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎన్నికల హడావిడి పూర్తయిన తరుణంలో జనాలు మెల్లగా సినిమాల వైపు తొంగి చూస్తారు. నిన్నటిదాకా ప్రచారాలు, ఓట్ల దందాలు, డబ్బు పంపకాలు, ప్రయాణాలు, టీవీలో వార్తల విశ్లేషణలు, మిత్రులతో చర్చలు ఇలా బోలెడు సమయం ఎలక్షన్ల కోసమే కేటయించి అలిసిపోయారు. ఇప్పుడు అత్యవసరంగా వినోదం కావాలి. సగటు తెలుగు వాడు ముందుగా పెట్టుకునే ఆప్షన్ థియేటర్. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఉన్నంతలో కృష్ణమ్మ కాస్త డీసెంట్ గా ఉండగా మరీ ఘనంగా చెప్పుకునే వసూళ్లయితే రావడం లేదు. టైమింగ్ చూసుకుని వచ్చిన ప్రతినిధి 2 వీక్ కంటెంట్ వల్ల తేలిపోయింది. అంతకు ముందు వచ్చిన ప్రసన్నవదనంనే రకరకాల ప్రమోషనల్ స్ట్రాటజీలతో నిర్మాత పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదేమంత గొప్ప ఫలితం ఇవ్వడం లేదు. ఆ ఒక్కటి అడక్కు ఆల్రెడీ సైలెంట్ అయిపోయింది. వీటి కన్నా ఏ సెంటర్స్ లో హాలీవుడ్ మూవీ ది కింగ్ డం అఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మెరుగైన ఆక్యుపెన్సీలు చూపిస్తోంది.
ఒకవేళ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కనక ఈ శుక్రవారమే వచ్చి ఉంటే భారీ ఓపెనింగ్స్ దక్కేవని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడో డిసెంబర్ నుంచి అనుకుంటున్న సినిమా ఇప్పుడు మే వచ్చినా కూడా ఇంకా సిద్ధంగా లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా మే 31 పోటీ ఎక్కువగా ఉంది. ముందే ఈ డేట్ ప్రకటించుకున్న హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, గం గం గణేశా, సత్యభామ, భజే వాయు వేగం తప్పుకున్నట్టు లేదా వాయిదా పడినట్టు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఒకటి రెండు అవ్వొచ్చు కానీ సోలోగా పండగ చేసుకోవాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఇప్పుడు రెవిన్యూని పంచుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on May 14, 2024 11:35 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…