కమల్ హాసన్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. 90ల చివర్లో వచ్చిన ఈ చిత్రం సౌత్ ఇండియాలో అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ మొదలు కావడం.. కమలే అందులో హీరోగా నటించడం, శంకరే దర్శకుడు కావడం విశేషమే.
ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రకటించారో కానీ.. దీనికి ఏదీ కలిసి రావడం లేదు. సినిమా పట్టాలెక్కడంలోనే ఆలస్యం జరిగింది. ఆ తర్వాత షూటింగ్కు బ్రేక్ పడుతూ వచ్చింది. గత ఏడాది ‘ఇండియన్-2’ షూటింగ్ స్పాట్లో భారీ క్రేన్ కూడా చిత్ర బృందంలోని ముగ్గురు చనిపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే.
ఈ విషాదం నుంచి కోలుకుని మళ్లీ చిత్రీకరణ మొదలుపెడదాం అనుకునేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. ఆ ప్రమాదానికి సంబంధించి మధ్యలో నిర్మాతలతో హీరో కమల్కు విభేదాలు తలెత్తడం, వాటిని పరిష్కరించుకోవడానికి కూడా సమయం పట్టింది.
ఐతే కరోనా భయం తగ్గించుకుని వరుసగా సినిమాల షూటింగ్లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘ఇండియన్-2’ను కూడా మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ కమల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తన సొంత నిర్మాణ సంస్థలో ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కొత్త చిత్రం అనౌన్స్ చేశాడు.
ఈ సినిమాను ఇంకొన్ని రోజుల్లోనే మొదలుపెట్టేస్తున్నారు. వచ్చే వేసవికి విడుదల అని కూడా ప్రకటించేశారు. శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడుకున్నది. కరోనా నేపథ్యంలో సెట్లో 50 మందికి మించి ఉండకూదన్న నిబంధనల్ని ‘ఇండియన్-2’ విషయంలో పాటించడం కష్టం.
అసలే ఇంతకుముందు ప్రమాదం జరిగింది. ఇప్పుడు యూనిట్లో ఎవరైనా కరోనా బారిన పడి ఏమైనా అయితే ఆ పాపం మోయలేమన్న ఉద్దేశంతో పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ‘ఇండియన్-2’ షూటింగ్ చేయొద్దని నిర్ణయించారట. ఈ లోపు ఖాళీలో కమల్.. లోకేష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు.
అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ‘ఇండియన్-2’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది కూడా ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. లోకేష్ సినిమా పూర్తయ్యాక కమల్ కొన్ని నెలల పాటు ఎన్నికల పనిలో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత కానీ ‘ఇండియన్-2’ను మొదలు పెట్టే అవకాశం లేదు.
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…