xr:d:DAFSAEOYWnI:2350,j:5503790880458466035,t:23060205
మాములుగా ఏ భాష సినిమాలైనా థియేటర్ కు ఓటిటికి మహా అయితే రెండు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం చూడం. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్, ఇమేజ్ లేని చిన్న హీరోలు నటించిన బడ్జెట్ మూవీ ఏదైనా సరే అందరూ ఇదే సూత్రం పాటిస్తున్నారు.
ఒకవేళ ఫ్లాప్ అయ్యే సూచనలు ముందే పసిగడితే కేవలం 21 రోజుల విండో పాటిస్తున్న అగ్ర నిర్మాతలు కళ్ళముందే ఉన్నారు. కానీ ఏడాదికి దగ్గరగా ఉన్న టైంలో ఒక చిత్రం డిజిటల్ కు రావడం విచిత్రమే. అదే జర హట్కే జర బచ్కే. విక్కీ కౌశల్, సారాఅలీ ఖాన్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత ఏడాది జూన్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది.
టాక్ యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ మధ్యలో వచ్చినా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ ని ఆశ్యర్యపరిచింది. విశ్లేషకులు కంటెంట్ మీద రకరకాల కామెంట్లకు చేశారు. అయినా సరే జనం ఆదరించారు. కట్ చేస్తే థియేటర్లో మిస్ అయినవాళ్లు ఇంట్లో చూద్దామని ఓటిటి కోసం ఎదురు చూస్తుంటే ఎంతకీ రాలేదు.
తొలుత హక్కుల కొనుగోలు విషయంలో ఏదో జరిగిందని, దాని వల్లే ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ చేసుకోలేదని టాక్ వచ్చింది. అలా అదిగో ఇదిగో అంటూ ఫైనల్ గా మే 17 జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఒకరకంగా ఈ పరిణామం మేలే చేసింది.
ఇంత లేట్ అయ్యిందంటే అంతగా ఏముందనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోయింది. ఆ స్పందన సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఒకవేళ నిన్న సంవత్సరమే త్వరగా వచ్చి ఉంటే దీనికి ఇంత ఓటిటి బజ్ వచ్చేది కాదనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు. అలా అని ఇది అందరూ పాటించేది కాదు.
ఎందుకంటే ఓటిటిలకు వ్యూస్ పరంగా ఫీడింగ్ వచ్చేందుకు ప్రధాన కారణమే వీలైనంత త్వరగా డిజిటల్ రిలీజ్ పెట్టుకోవడం. అలాంటిది ఇలా నెలల తర్వాత అంటే రేటు విషయంలో భారీ కోత పెట్టేస్తారు. ఏదో జర హట్కే జర బచ్కే టైం బాగుంది కాబట్టి ఇలా గట్టెక్కిపోయింది.
This post was last modified on May 14, 2024 7:17 am
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…