స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూతుకి వస్తే మాత్రం అందులో సామజిక బాధ్యత ఉంటుంది.
సగటున ఓటింగ్ పర్సెంటెజ్ ప్రతి ఏడాది తగ్గుతున్న తరుణంలో తారలు తమ వంతు కర్తవ్యంగా ఓట్లు వేయడమే కానీ అభిమానులను ఈ యజ్ఞంలో పాలు పంచుకోమని పిలుపు ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, ఏపీలోనే పలు కేంద్రాల్లో టాలీవుడ్ స్టార్లు ఇంకా ఎండపొడ తాకక ముందే బూత్స్ కి వెళ్ళిపోయి క్యూలో నిలబడి మరీ తమ హక్కును వినియోగించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, నాగచైతన్య, మంచు మనోజ్ తదితరులంతా తమ హక్కు ఉన్న కేంద్రాలకు వెళ్లి సిరా ఇంకు వేయించుకుని సందేశాన్ని వినిపించారు. మరికొందరు ఎప్పటికప్పుడు ఈ లిస్టులో తోడవుతూనే ఉన్నారు.
కొందరు తెలంగాణ, మరికొందరు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రతువులో భాగమయ్యారు. అయినా ఉదయం పది గంటలు దాటుతున్నా పోలింగ్ శాతం ఇంకా పెద్ద స్థాయిలో లేకపోవడం తెలంగాణ ట్రెండ్స్ లో కనిపించింది. ఈ విషయంగానే రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక రేపటి నుంచి ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలక్షన్ల వల్లే ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కాస్త బ్రేక్ తీసుకుని ప్రచారంలో పాల్గొనడం చూశాం. ముఖ్యంగా జనసేనకు మద్దతుగా పిఠాపురంలో జరిగిన క్యాంపైన్ కు పదుల సంఖ్యలో ఇండస్ట్రీ నుంచి వెళ్లడం తెలిసిందే.
ఫలితాలకు ఇంకో మూడు వారాల సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పొలిటికల్ డిస్కషన్లు లేనట్టే. అయినా అధికారికంగా సెలవు రోజు ప్రకటించినా ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో ఓట్లు వేసేందుకు రాకపోవడం విచిత్రం. కాకపోతే 2019 కంటే ఈసారి ఎక్కువ నమోదవుతుందని ఒక అంచనా.
This post was last modified on May 13, 2024 11:03 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…