Movie News

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూతుకి వస్తే మాత్రం అందులో సామజిక బాధ్యత ఉంటుంది.

సగటున ఓటింగ్ పర్సెంటెజ్ ప్రతి ఏడాది తగ్గుతున్న తరుణంలో తారలు తమ వంతు కర్తవ్యంగా ఓట్లు వేయడమే కానీ అభిమానులను ఈ యజ్ఞంలో పాలు పంచుకోమని పిలుపు ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, ఏపీలోనే పలు కేంద్రాల్లో టాలీవుడ్ స్టార్లు ఇంకా ఎండపొడ తాకక ముందే బూత్స్ కి వెళ్ళిపోయి క్యూలో నిలబడి మరీ తమ హక్కును వినియోగించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, నాగచైతన్య, మంచు మనోజ్ తదితరులంతా తమ హక్కు ఉన్న కేంద్రాలకు వెళ్లి సిరా ఇంకు వేయించుకుని సందేశాన్ని వినిపించారు. మరికొందరు ఎప్పటికప్పుడు ఈ లిస్టులో తోడవుతూనే ఉన్నారు.

కొందరు తెలంగాణ, మరికొందరు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రతువులో భాగమయ్యారు. అయినా ఉదయం పది గంటలు దాటుతున్నా పోలింగ్ శాతం ఇంకా పెద్ద స్థాయిలో లేకపోవడం తెలంగాణ ట్రెండ్స్ లో కనిపించింది. ఈ విషయంగానే రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక రేపటి నుంచి ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలక్షన్ల వల్లే ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కాస్త బ్రేక్ తీసుకుని ప్రచారంలో పాల్గొనడం చూశాం. ముఖ్యంగా జనసేనకు మద్దతుగా పిఠాపురంలో జరిగిన క్యాంపైన్ కు పదుల సంఖ్యలో ఇండస్ట్రీ నుంచి వెళ్లడం తెలిసిందే.

ఫలితాలకు ఇంకో మూడు వారాల సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పొలిటికల్ డిస్కషన్లు లేనట్టే. అయినా అధికారికంగా సెలవు రోజు ప్రకటించినా ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో ఓట్లు వేసేందుకు రాకపోవడం విచిత్రం. కాకపోతే 2019 కంటే ఈసారి ఎక్కువ నమోదవుతుందని ఒక అంచనా.

Page: 1 2 3 4 5

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

6 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

6 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

6 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

7 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

8 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

9 hours ago