స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూతుకి వస్తే మాత్రం అందులో సామజిక బాధ్యత ఉంటుంది.
సగటున ఓటింగ్ పర్సెంటెజ్ ప్రతి ఏడాది తగ్గుతున్న తరుణంలో తారలు తమ వంతు కర్తవ్యంగా ఓట్లు వేయడమే కానీ అభిమానులను ఈ యజ్ఞంలో పాలు పంచుకోమని పిలుపు ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, ఏపీలోనే పలు కేంద్రాల్లో టాలీవుడ్ స్టార్లు ఇంకా ఎండపొడ తాకక ముందే బూత్స్ కి వెళ్ళిపోయి క్యూలో నిలబడి మరీ తమ హక్కును వినియోగించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బ్రహ్మానందం, నాగచైతన్య, మంచు మనోజ్ తదితరులంతా తమ హక్కు ఉన్న కేంద్రాలకు వెళ్లి సిరా ఇంకు వేయించుకుని సందేశాన్ని వినిపించారు. మరికొందరు ఎప్పటికప్పుడు ఈ లిస్టులో తోడవుతూనే ఉన్నారు.
కొందరు తెలంగాణ, మరికొందరు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రతువులో భాగమయ్యారు. అయినా ఉదయం పది గంటలు దాటుతున్నా పోలింగ్ శాతం ఇంకా పెద్ద స్థాయిలో లేకపోవడం తెలంగాణ ట్రెండ్స్ లో కనిపించింది. ఈ విషయంగానే రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక రేపటి నుంచి ఎవరి షూటింగుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలక్షన్ల వల్లే ఎందరో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కాస్త బ్రేక్ తీసుకుని ప్రచారంలో పాల్గొనడం చూశాం. ముఖ్యంగా జనసేనకు మద్దతుగా పిఠాపురంలో జరిగిన క్యాంపైన్ కు పదుల సంఖ్యలో ఇండస్ట్రీ నుంచి వెళ్లడం తెలిసిందే.
ఫలితాలకు ఇంకో మూడు వారాల సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పొలిటికల్ డిస్కషన్లు లేనట్టే. అయినా అధికారికంగా సెలవు రోజు ప్రకటించినా ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో ఓట్లు వేసేందుకు రాకపోవడం విచిత్రం. కాకపోతే 2019 కంటే ఈసారి ఎక్కువ నమోదవుతుందని ఒక అంచనా.
This post was last modified on May 13, 2024 11:03 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…