ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం లాంటి చిత్రాలు రిలీజైతే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం, ప్రతినిధి-2 లాంటి చిత్రాలు వచ్చాయి.
ఐతే వీటిలో యూట్యూబ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చిన వివేకం మంచి స్పందన తెచ్చుకుంది. మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. మొత్ంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం స్ట్రైకింగ్గా ఉండి వైసీపీకి సోషల్ మీడియాలో ఇబ్బందికరంగా మారాయి.
ఐతే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వదులుతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు రాజధాని ఫైల్స్ టీవీ ప్రిమియర్ పడబోతోంది.అది కూడా జగన్ సర్కారుకు ఫుల్ యాంటీ అయిన ఈటీవీలో కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి సినిమా టీవీల్లో ప్రసారమై జనాలు చూస్తే.. దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఈ చిత్రంలో అమరావతి రైతుల బాధలను కొన్ని సన్నివేశాల్లో హృద్యంగా చూపించారు. అదే సమయంలో జగన్ను పోలిన సీఎం పాత్రను చాలా దుర్మార్గంగా చూపించారు.. గత ఐదేళ్లలో జరిగిన అనేక కీలక పరిణామాలను వైసీపీకి ప్రతికూలంగా చూపించారు ఇందులో. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన జనం.. ఉచితంగా ఈ సినిమాను టీవీల్లో చూడ్డానికి ఆసక్తి చూపించొచ్చు. కాబట్టి ఇది వైసీపీకి కొంత ఇబ్బందే.
This post was last modified on May 12, 2024 10:38 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…