ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం లాంటి చిత్రాలు రిలీజైతే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం, ప్రతినిధి-2 లాంటి చిత్రాలు వచ్చాయి.
ఐతే వీటిలో యూట్యూబ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చిన వివేకం మంచి స్పందన తెచ్చుకుంది. మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. మొత్ంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం స్ట్రైకింగ్గా ఉండి వైసీపీకి సోషల్ మీడియాలో ఇబ్బందికరంగా మారాయి.
ఐతే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వదులుతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు రాజధాని ఫైల్స్ టీవీ ప్రిమియర్ పడబోతోంది.అది కూడా జగన్ సర్కారుకు ఫుల్ యాంటీ అయిన ఈటీవీలో కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి సినిమా టీవీల్లో ప్రసారమై జనాలు చూస్తే.. దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఈ చిత్రంలో అమరావతి రైతుల బాధలను కొన్ని సన్నివేశాల్లో హృద్యంగా చూపించారు. అదే సమయంలో జగన్ను పోలిన సీఎం పాత్రను చాలా దుర్మార్గంగా చూపించారు.. గత ఐదేళ్లలో జరిగిన అనేక కీలక పరిణామాలను వైసీపీకి ప్రతికూలంగా చూపించారు ఇందులో. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన జనం.. ఉచితంగా ఈ సినిమాను టీవీల్లో చూడ్డానికి ఆసక్తి చూపించొచ్చు. కాబట్టి ఇది వైసీపీకి కొంత ఇబ్బందే.
This post was last modified on May 12, 2024 10:38 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…