ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం లాంటి చిత్రాలు రిలీజైతే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం, ప్రతినిధి-2 లాంటి చిత్రాలు వచ్చాయి.
ఐతే వీటిలో యూట్యూబ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చిన వివేకం మంచి స్పందన తెచ్చుకుంది. మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. మొత్ంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం స్ట్రైకింగ్గా ఉండి వైసీపీకి సోషల్ మీడియాలో ఇబ్బందికరంగా మారాయి.
ఐతే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వదులుతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు రాజధాని ఫైల్స్ టీవీ ప్రిమియర్ పడబోతోంది.అది కూడా జగన్ సర్కారుకు ఫుల్ యాంటీ అయిన ఈటీవీలో కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి సినిమా టీవీల్లో ప్రసారమై జనాలు చూస్తే.. దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఈ చిత్రంలో అమరావతి రైతుల బాధలను కొన్ని సన్నివేశాల్లో హృద్యంగా చూపించారు. అదే సమయంలో జగన్ను పోలిన సీఎం పాత్రను చాలా దుర్మార్గంగా చూపించారు.. గత ఐదేళ్లలో జరిగిన అనేక కీలక పరిణామాలను వైసీపీకి ప్రతికూలంగా చూపించారు ఇందులో. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన జనం.. ఉచితంగా ఈ సినిమాను టీవీల్లో చూడ్డానికి ఆసక్తి చూపించొచ్చు. కాబట్టి ఇది వైసీపీకి కొంత ఇబ్బందే.
This post was last modified on May 12, 2024 10:38 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…