ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం లాంటి చిత్రాలు రిలీజైతే.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ రాజధాని ఫైల్స్, వివేకం, ప్రతినిధి-2 లాంటి చిత్రాలు వచ్చాయి.
ఐతే వీటిలో యూట్యూబ్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చిన వివేకం మంచి స్పందన తెచ్చుకుంది. మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు. రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినా.. మొత్ంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు మాత్రం స్ట్రైకింగ్గా ఉండి వైసీపీకి సోషల్ మీడియాలో ఇబ్బందికరంగా మారాయి.
ఐతే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వదులుతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు రాజధాని ఫైల్స్ టీవీ ప్రిమియర్ పడబోతోంది.అది కూడా జగన్ సర్కారుకు ఫుల్ యాంటీ అయిన ఈటీవీలో కావడం విశేషం. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ప్రసారం కాబోతోంది. ఎన్నికలు జరగడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి సినిమా టీవీల్లో ప్రసారమై జనాలు చూస్తే.. దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది.
ఈ చిత్రంలో అమరావతి రైతుల బాధలను కొన్ని సన్నివేశాల్లో హృద్యంగా చూపించారు. అదే సమయంలో జగన్ను పోలిన సీఎం పాత్రను చాలా దుర్మార్గంగా చూపించారు.. గత ఐదేళ్లలో జరిగిన అనేక కీలక పరిణామాలను వైసీపీకి ప్రతికూలంగా చూపించారు ఇందులో. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన జనం.. ఉచితంగా ఈ సినిమాను టీవీల్లో చూడ్డానికి ఆసక్తి చూపించొచ్చు. కాబట్టి ఇది వైసీపీకి కొంత ఇబ్బందే.
This post was last modified on May 12, 2024 10:38 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…