మంచు విష్ణు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కన్నప్పలో భారీ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, నయనతార.. ఇలా ముఖ్య పాత్రలకు అదిరిపోయే కాస్టింగ్ సెట్ చేయగలిగాడు విష్ణు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఈ చిత్రంలో నటించడం బిజినెస్ పరంగా పెద్ద ప్లస్సే. ఇటీవలే ప్రభాస్ ఈ సినిమా సెట్లో కూడా అడుగు పెట్టేశాడు. షూటింగ్లో పాల్గొంటున్నాడు.
ఐతే ఈ చిత్రంలోప్రభాస్ చేస్తున్న పాత్ర ఏంటనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. ముందు ప్రభాస్ శివుడి పాత్ర చేస్తాడన్నారు. కానీ తర్వాత నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఐతే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నది ఏ పాత్ర అన్నది వెల్లడించలేదు కానీ.. తాము ఒక పాత్రను ఆఫర్ చేస్తే ప్రభాస్ ఇంకో క్యారెక్టర్ ఎంచుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించాడు.
ప్రభాస్కు కథ చెప్పడానికి వెళ్లినపుడు ముందు అతణ్ని ఏ పాత్రకు అనుకుంటున్నది చెప్పామని.. ఐత కథ మొత్తం విన్నాక తాము చెప్పిన పాత్ర కాకుండా మరో పాత్ర చేస్తానని ప్రభాస్ అన్నాడని.. తనకు నచ్చిన పాత్ర చేస్తే ఇంకా సంతోషం అని చెప్పి ఆ పాత్రనే తనతో చేయిస్తున్నట్లు విష్ణు వెల్లడించాడు.
ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు.. మిగతా పేరున్న ఆర్టిస్టులు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారు అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని.. వాటిని అభిమానులు నమ్మవద్దని.. త్వరలోనే అప్డేట్స్ ద్వారా ఎవరు ఏ పాత్ర చేస్తున్నది అధికారికంగా ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు. అంతకంటే ముందు ఈ నెల 13న ఒక అదిరిపోయే అప్డేట్ను అభిమానులతో పంచుకోబోతున్నామని.. అది అందరినీ ఎంతో ఎగ్జైట్ చేసేలా ఉంటుందని విష్ణు తెలిపాడు.మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ రూపొందిస్తున్నాడు.
This post was last modified on May 12, 2024 9:43 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…