ఇంకో నాలుగు రోజుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు రాబోతోంది. మే 15 గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులకో కంటెంట్ కావాలి. దాన్ని డబుల్ ఇస్మార్ట్ బృందం తప్ప ఎవరూ ఇవ్వలేరన్న సంగతి తెలిసిందే.
అయితే అది పోస్టర్ రూపంలోనా లేక టీజర్ వదులుతారానే విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా డిసైడ్ చేయలేదు. జూన్ లో వచ్చే సూచనలు లేనట్టే. భారతీయుడు 2 తప్పుకున్నా దాని ప్లేస్ లో ధనుష్ రాయన్ కర్చీఫ్ వేసుకుంది. అదేమీ పోటీ కాదు కానీ అసలు పూరి జూన్ ఆప్షన్ పెట్టుకోలేదట.
ఎట్టి పరిస్థితుల్లో జూలైకే లాక్ చేసుకోవాలి. కాకపోతే ఇండియన్ 2 కు వారం ముందో లేదా ఓ రెండు వారాలు తర్వాతో ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాల ఓపెనింగ్స్ కి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఆగస్ట్ అనుకుంటే అక్కడ పుష్ప 2 ది రూల్ రూపంలో డైనోసార్ కాచుకుని ఉంటాడు.
పైగా అంత ఆలస్యం చేసినా కష్టమే. అందుకే నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ తో కలిసి పూరి తీవ్ర సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతానికి టీజర్ వీడియో అయితే సిద్ధం చేసి ఉంచారని తెలిసింది. ఒకవేళ విడుదల తేదీ ఓకే అనుకుంటే అందులో పొందుపరుస్తారు లేదంటే కమింగ్ సూన్ ని పెట్టేసి మమ అనిపిస్తారు. అంతే అనుకోకండి.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది. ఫైనల్ టీజర్ కట్ పూరి, రామ్ ఇద్దరిలో ఎవరికీ పూర్తి సంతృప్తి కలిగించకపోయినా సరే వచ్చే ఛాన్స్ ఉండదు. కేవలం పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ బలంగా ఉంది. ఫస్ట్ పార్ట్ ని తలదన్నేలా ఊహించని చాలా అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది. మణిశర్మ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఆల్బమ్ ఆయన ఇవ్వలేదు. నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే రీస్టార్ట్ అయిన డబుల్ ఇస్మార్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.
This post was last modified on May 11, 2024 1:31 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…