ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన చిత్రం ఆరంభం. పేరున్న నటీనటులు లేకపోయినా ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించారన్న అభిప్రాయం జనంలో కలిగించగలిగారు. కృష్ణమ్మ, ప్రతినిధి 2 పోటీ మధ్య దిగిన ఆరంభం నిన్న రిలీజయ్యింది.
కంటెంట్ బాగుంటే క్యాస్టింగ్ ఎవరని పట్టించుకోకుండా హిట్ చేసే తెలుగు ఆడియన్స్ ని నమ్ముకుని థియేటర్లకు తీసుకొచ్చారు. మోహన్ భగత్ హీరోగా నటించిన ఈ టైం థ్రిల్లర్ కు అజయ్ వీటి దర్శకత్వం వహించగా సింజిత్ సంగీతం సమకూర్చారు. ఇంతకీ బొమ్మెలా ఉందో చూద్దాం.
మిగిల్ (మోహన్ భగత్) ఉరిశిక్ష పడ్డ ఖైదీ. ఇంకొద్ది గంటల్లో శిక్ష అమలు పరచాల్సి ఉండగా కాలఘటి జైలు నుంచి అంతుచిక్కని రీతిలో తప్పించుకుంటాడు. నిజం వెలికితీయడానికి ఒక డిటెక్టివ్ (రవీంద్ర విజయ్) వస్తాడు. అప్పుడే తోటి ఖైదీ(లక్ష్మణ్) ఇచ్చిన డైరీ ద్వారా గతం తెలుస్తుంది. ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే సైంటిస్ట్ రావు (భూషణ్ కళ్యాణ్) టైం ట్రావెల్ మీద ప్రయోగాలు చేస్తుంటాడు. మిగిల్ మీద ఈ ఎక్స్ పరిమెంట్ పని చేస్తుంది. దీని ద్వారా తల్లి (సురభి ప్రభావతి) ని సంతోషపెట్టే పనులు చేస్తాడు. ఆ తర్వాత జరిగే ఊహించని సంఘటనలు కథను మలుపు తిప్పుతాయి.
శర్వానంద్ ఒకే ఒక జీవితంకు దగ్గరగా అనిపించే లైన్ తీసుకున్న అజయ్ వీటి అంత ఎంగేజింగ్ గా ఆరంభంని తీర్చిదిద్దలేదు. టెక్నికల్ పనితనం చాలా బాగున్నా విపరీతమైన నెమ్మదితనంతో సాగే స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ దాకా సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది.
సెకండాఫ్ లో కొంత స్పీడ్ పెరిగినా అసంతృప్తిని పూర్తిగా తగ్గించలేకపోయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఇచ్చే ట్విస్టులు బాగున్నాయి. చాలా బడ్జెట్ పరిమితుల మధ్య కష్టపడిన వైనం కనిపిస్తుంది.
అధ్యాయాల రూపంలో చెప్పే ప్రయత్నం కొంత కన్ఫ్యూజన్ కు దారి తీసింది. ఆర్టిస్టులు పర్వాలేదు. బోలెడు ఓపికని డిమాండ్ చేసే ఆరంభం ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రం కాదు.
This post was last modified on May 11, 2024 9:39 am
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…