మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఒక ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటిదాకా డార్లింగ్ చేస్తోంది ఏ పాత్రనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ఒకసారి శివుడిగా మరోసారి నందీశ్వరుడిగా చేస్తాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. వీటికి దాదాపుగా చెక్ పడినట్టే. ఎందుకంటే పిక్ లో ఉన్న ప్రభాస్ కాళ్ళ మీద కనిపిస్తున్న దుస్తులు పులి చర్మంతో కప్పబడి ఉన్నాయి. అంటే కాలరుద్రుడి వేషధారణ కాబట్టే ఇలా డిజైన్ చేసి ఉంటారని చెప్పొచ్చు. పూర్తి స్టిల్ వస్తే డౌట్లన్నీ తీరిపోతాయి.
తక్కువ కాల్ షీట్లలోనే ప్రభాస్ భాగాన్ని పూర్తి చేయబోతున్నారని సమాచారం. కన్నప్ప కథ ప్రకారం శివుడు కేవలం క్లైమాక్స్ లోనే వస్తాడు. కృష్ణంరాజు గారి సినిమాలోనూ ఇదే ఉంటుంది. మధ్యలో సన్నివేశాల అవసరానికి తగ్గట్టు కనిపిస్తాడు తప్పించి మొదటి నుంచి చివరి దాకా కన్నప్ప నివసించే గూడెం, అడవిలోనే మొత్తం స్టోరీ జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువ కాల్ షీట్లు అవసరం లేదు . దానికి అనుగుణంగానే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ప్లాన్ చేసుకుని పూర్తి చేస్తున్నారట. ఇటీవలే అక్షయ్ కుమార్ భాగాన్ని చాలా వేగంగా తక్కువ టైంలో ఫినిష్ చేసి సాగనంపడం చూశాం.
బాహుభాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న కన్నప్పని ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ దాకా ఈ సంవత్సరం డేట్లు వేర్వేరు భారీ సినిమాలకు లాకయ్యాయి కాబట్టి 2025 తప్పదు. కాకపోతే ఎప్పుడు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు తదితర క్రేజీ క్యాస్టింగ్ తో తీస్తున్న కన్నప్ప ఇప్పటి ఆడియన్స్ ని సరళంగా అర్థమయ్యేలా తీయడానికి విష్ణు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్నట్టు నయనతార ఉందనే వార్త వచ్చింది కానీ ఇప్పటికైతే ఎలాంటి నిర్ధారణ రాలేదు.
This post was last modified on May 9, 2024 4:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…