Movie News

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత బజ్ లేదు. ఏపీలో రాజకీయాల పట్ల జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

అధికార వైసిపి ప్రచారానికి ధీటుగా టీడీపీ జనసేన కూటమి పబ్లిక్ లోకి బలంగా చొచ్చుకుపోవడంతో పరిణామాలు థ్రిల్లర్ మూవీని మించి జరుగుతున్నాయి. ఇంకో వైపు మే 13 పోలింగ్ తేదీ ముంచుకు వస్తోంది.

ఇది ఒక్క రోజు హడావిడని కొట్టిపారేయడానికి లేదు. హైదరాబాద్ తో సహా చాలా ఊళ్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

అంతే రెండో శనివారం, సండే, సోమవారం ఓటింగ్ వెరసి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ హడావిడిలో అదే పనిగా థియేటర్లకు వెళ్లే మూడ్ లో ప్రేక్షకులు లేరన్నది వాస్తవం. అయితే కృష్ణమ్మ టాక్ నే నమ్ముకుంది.

కొరటాల శివ సమర్పకుడు కావడంతో ఆయన వైపు నుంచి పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా పూర్తి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. రాజమౌళి గెస్టుగా వచ్చాడు.

ఇంత చేసినా అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. మార్నింగ్ షో తర్వాత వచ్చే రెస్పాన్స్ ని బట్టే కౌంటర్ అమ్మకాలు ఆధారపడి ఉంటాయి.

అసలీ టెన్షన్ లేకుండా ఇంకొక్క వారం ఆగి ఉండాల్సిందని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. అయితే మే 17 గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఉంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ డ్రామాని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ట్రయిలర్ వచ్చాక హైప్ అమాంతం పెరుగుతుందని టీమ్ బలంగా నమ్ముతోంది. దాంతో క్లాష్ అవ్వడం కన్నా ప్రతినిధి 2తో తలపడటమే సేఫ్ అని కృష్ణమ్మ బృందం భావించి ఉండొచ్చు. ఇది సక్సెస్ కావడం మీదే సత్యదేవ్ తర్వాతి సినిమాలు ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ వన్ బిజినెస్ ఆధారపడి ఉంది. చూడాలి ఏం చేయబోతున్నాడో.

This post was last modified on May 8, 2024 9:20 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

3 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago