ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత బజ్ లేదు. ఏపీలో రాజకీయాల పట్ల జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.
అధికార వైసిపి ప్రచారానికి ధీటుగా టీడీపీ జనసేన కూటమి పబ్లిక్ లోకి బలంగా చొచ్చుకుపోవడంతో పరిణామాలు థ్రిల్లర్ మూవీని మించి జరుగుతున్నాయి. ఇంకో వైపు మే 13 పోలింగ్ తేదీ ముంచుకు వస్తోంది.
ఇది ఒక్క రోజు హడావిడని కొట్టిపారేయడానికి లేదు. హైదరాబాద్ తో సహా చాలా ఊళ్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
అంతే రెండో శనివారం, సండే, సోమవారం ఓటింగ్ వెరసి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ హడావిడిలో అదే పనిగా థియేటర్లకు వెళ్లే మూడ్ లో ప్రేక్షకులు లేరన్నది వాస్తవం. అయితే కృష్ణమ్మ టాక్ నే నమ్ముకుంది.
కొరటాల శివ సమర్పకుడు కావడంతో ఆయన వైపు నుంచి పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా పూర్తి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. రాజమౌళి గెస్టుగా వచ్చాడు.
ఇంత చేసినా అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. మార్నింగ్ షో తర్వాత వచ్చే రెస్పాన్స్ ని బట్టే కౌంటర్ అమ్మకాలు ఆధారపడి ఉంటాయి.
అసలీ టెన్షన్ లేకుండా ఇంకొక్క వారం ఆగి ఉండాల్సిందని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. అయితే మే 17 గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఉంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ డ్రామాని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ట్రయిలర్ వచ్చాక హైప్ అమాంతం పెరుగుతుందని టీమ్ బలంగా నమ్ముతోంది. దాంతో క్లాష్ అవ్వడం కన్నా ప్రతినిధి 2తో తలపడటమే సేఫ్ అని కృష్ణమ్మ బృందం భావించి ఉండొచ్చు. ఇది సక్సెస్ కావడం మీదే సత్యదేవ్ తర్వాతి సినిమాలు ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ వన్ బిజినెస్ ఆధారపడి ఉంది. చూడాలి ఏం చేయబోతున్నాడో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…