కంగనా రనౌత్ను ఎవరైనా విమర్శించారంటే అంతే సంగతులు. వాళ్లు జడుసుకునేలా మాట్లాడి నోళ్లు మూయించేస్తుంది. ఆమె ఎంతకైనా తెగించి మాట్లాడుతుంది కాబట్టే.. తన నోటిదురుసుకు భయపడే చాలామంది సైలెంటుగా ఉండిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం కంగనను ఢీకొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్.. కంగనాను కౌంటర్ చేసింది.
బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ మయం అయిందంటూ కంగనా చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ తప్పుబట్టింది. అంతటితో ఆగకుండా కంగనా సొంత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్.. డ్రగ్స్ అడ్డాగా మారిందని.. కంగనా ప్రక్షాళన కోరుకుంటే ముందు తన సొంత రాష్ట్రం నుంచే మొదలుపెట్టాలని ఆమె ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
ఐతే కంగనా ఓ టీవీ ఛానెల్ చర్చకు వచ్చిన సందర్భంగా దాని ప్రెజెంటర్ ఊర్మిళ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ఆమె హద్దులు దాటి మాట్లాడింది. ఊర్మిళ పేరెత్తగానే ఆమె ఒక సాఫ్ట్ పోర్న్ యాక్టర్ అనేసింది. ఊర్మిళ ఎఫ్పుడూ నటిగా గుర్తింపు సంపాదించలేదని, గ్లామర్ క్యారెక్టర్లతో సాఫ్ట్ పోర్న్ యాక్టర్ ఇమేజే తెచ్చుకుందని కంగనా ఎద్దేవా చేసింది.
ఊర్మిళ విసిరిన సవాల్ గురించి మాత్రం మాట్లాడని కంగనా.. రాజకీయాల్లోకి వస్తావా, ఎన్నికల్లో పోటీ చేస్తావా అన్న ప్రశ్న ఎదురైనపుడు మరోసారి ఊర్మిళ ప్రస్తావనే తెచ్చింది. ఊర్మిళ లాంటి నటికే టికెట్ ఇచ్చినపుడు నాకెందుకు ఇవ్వరు అన్నట్లు మాట్లాడింది. ఐతే ఊర్మిళపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటిదాకా కంగనాకు మద్దతిస్తున్న వాళ్లకు కూడా మండిపోయింది.
ఊర్మిళ ‘రంగీలా’ సహా కొన్ని సినిమాల్లో గ్లామరస్గా కనిపించి ఉండొచ్చు కానీ.. ‘సత్య’ సహా కొన్ని సినిమాల్లో చాలా బాగా నటించింది కూడా. ఆ మాటకొస్తే కంగనా సైతం తనకంటూ ఓ గుర్తింపు రావడానికి బూతు టచ్ ఉన్న సినిమాలే చేసింది. అలాంటపుడు ఊర్మిళను సాఫ్ట్ పో్ర్న్ యాక్టర్ అనడం ఎంత వరకు సబబన్నది బాలీవుడ్ అభిమానుల ప్రశ్న.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…