Movie News

మైనస్ వంద గురించి బన్నీ నిజాయితీ

మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కేవలం తన మీదే నెగటివిటీ వచ్చిందని హీరో బహిరంగంగా ఒప్పుకోవడం అల్లు అర్జున్ నిజాయితీకి నిదర్శనమని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. నిన్న ఆర్య 20వ వార్షికోత్సవ వేడుకని నిర్మాత దిల్ రాజు ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ అను మెహతా తప్ప ప్రధాన తారాగణం. టెక్నికల్ టీమ్ మొత్తం హాజరయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత జరిగిన కలయిక కావడంతో ఈవెంట్ ని కొత్త రిలీజ్ రేంజ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సుదీర్ఘంగా ప్రసంగించాడు. తొలి చిత్రం గంగోత్రి విజయం సాధించినా సరే తనకు మాత్రం మార్కులు రాలేదని, ఇంకా చెప్పాలంటే మైనస్ వందలో ఉన్నానని, అప్పుడు వచ్చిన ఆర్య ఒకేసారి డబుల్ వంద మార్కులు వేయించి ప్రమోషన్ ఇచ్చిందని తిరిగి తన జీవితంలో మళ్ళీ అంత హై చూడలేదని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడేది సాధించినా ఆర్య ఇచ్చిన కిక్ ముందు అవన్నీ బోనస్ గా ఫీలవుతాను తప్పించి మరేమి కాదని స్పష్టం చేశాడు. బన్నీ చెప్పింది నిజమే. సోషల్ మీడియా లేని టైంలో గంగోత్రి లుక్స్ మీద బయట ట్రోల్స్ తరహా కామెంట్స్ బలంగా వినిపించాయి.

ఆర్య చూశాకే అందరి నోళ్లు మూతబడ్డాయి. ఒక్క సినిమాకే ఇంత మేకోవర్ చేసుకోవడం చూసి ప్రేక్షకులు షాకయ్యారు. సుకుమార్ విజన్ లోని బలమది. దేవిశ్రీ ప్రసాద్ తప్ప ఆర్యకు పని చేసిన వాళ్లంతా జూనియర్లమేనని చెప్పిన అల్లు అర్జున్ ఇది ఎందరికి లైఫ్ ఇచ్చిందో, ఎందరిని దర్శకులుగా మార్చిందో ఆనందంగా వివరించాడు. అయినా ప్రభాస్, రవితేజలకు దగ్గరకు వెళ్లిన కథ అనుకోకుండా అల్లు అర్జున్ దగ్గరకి రావడం, అది కాస్తా లైఫ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోవడం సంథింగ్ స్పెషలని చెప్పాలి. ఆర్య వేసిన పునాదే ఇప్పటి సెన్సేషన్ పుష్ప దాకా బన్నీ సుకుమార్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

This post was last modified on May 8, 2024 12:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

40 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago