హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా గౌతమ్ ఉన్నాడు కానీ కుర్రాడికి సరైన హిట్లు లేక కెరీర్ పరంగా దూసుకెళ్లలేకపోయాడు. పైగా తండ్రి లాగా కామెడీ మీదున్న పట్టున్న నటుడు కాకపోవడంతో తన టాలెంట్, రూపానికి తగ్గట్టు హీరోగా నిలదొక్కుకోవాలనే చూశాడు. తొలి సినిమా పల్లకిలో పెళ్లికూతురుకి రాఘవేంద్ర రావు అండగా నిలబడి ఓ మోస్తరు విజయాన్ని అందించినా తరువాత దక్కిన ప్రయోజనం తక్కువే. అలా అప్పుడప్పుడు మాత్రమే కనిపించే గౌతమ్ త్వరలో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు.
నాన్న బ్రహ్మానందం తాత పాత్రలో తాను మనవడిగా నటించబోయే బ్రహ్మ ఆనందం సినిమాలో తమ కాంబోని అఫీషియల్ గా అనౌన్స్ చేయించాడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా ఆర్విఎస్ నిఖిల్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. అనౌన్స్ మెంట్ వీడియోని తండ్రి కొడుకులు ఇద్దరూ వెన్నెల కిషోర్ తో కలిసి వెరైటీగా చేయించారు. తాత పాత్ర చేయమంటే హాస్యబ్రహ్మ వ్యతిరేకించడం, ఒప్పుకున్నాక జరిగే సరదా సంభాషణ ఇలా వినూత్నంగా ప్లాన్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హొలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 6 విడుదల తేదీని కూడా అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు.
తన పేరు మీద సినిమా తీయడం అందులో బ్రహ్మానందమే నటించడం అరుదనే చెప్పాలి. గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అఖిల్ తమ పేర్లే టైటిల్స్ గా పెట్టుకుని సినిమాలు చేశారు. కానీ ఒక కమెడియన్ కి ఇలా జరగడం ఎప్పుడూ లేదు. అందులోనూ ఇంత లేట్ వయసులో గౌతమ్ కి తాతగా నటించే ఛాన్స్ రావడం బ్రహ్మానందానికి కొత్త ఆనందం ఇవ్వడం ఖాయం. చిన్న సినిమానే అయినా ఏకంగా ఎనిమిది నెలల ముందు విడుదల తేదీ చెప్పేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా విపరీతమైన పోటీ ఉన్న ట్రెండ్ లో ఈ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే.
This post was last modified on May 8, 2024 12:22 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…