Rao Ramesh
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో ఊరిపేరు భైరవకోన సక్సెస్ సందీప్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పైగా ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు తనతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంచి సబ్జెక్టులు పడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న ఈ కథ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఒకప్పుడు చిరంజీవికి చెప్పి ఒప్పించిందే. కాకపోతే పట్టాలెక్కలేదు.
ఇకపోతే దీనికి సంబంధించిన ఒక లీక్ ఆసక్తికరంగా ఉంది. దాని ప్రకారం సందీప్ కిషన్ తండ్రిగా నటిస్తున్న రావు రమేష్ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుందట. అంటే వయసొచ్చిన కొడుకు ఉన్నా సరే రొమాంటిక్ టచ్ పెట్టి అతనికో ప్రియురాలని సెట్ చేస్తున్నట్టు తెలిసింది.
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున మన్మథుడు, ప్రభాస్ రాఘవేంద్రలో హీరోయిన్ గా నటించిన అన్షు. ముందు ప్రియమణి, మధుబాల లాంటి ఆప్షన్లు చూశారు కానీ స్టోరీ వినగానే అన్షు సానుకూలంగా స్పందించడంతో అధికారికంగా ఓకే అనుకున్నాక దీని కోసమే ఆవిడను విదేశాల నుంచి తీసుకొస్తారట.
ఎక్కువ మామా అల్లుళ్ళ డ్రామాలతో నవ్వించే త్రినాధరావు నక్కిన ప్రసన్నల జంట ఈసారి రూటు మార్చిందని మాట. సందీప్ కిషన్ జోడి ఇంకా లాక్ కాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ చలాకిగా చేసే అమ్మాయి అవసరం కావడంతో కొత్త టాలెంట్ ని వెతుకుతున్నారని ఇన్ సైడ్ టాక్.
కేవలం హీరోకే కాదు ఇది ఘనవిజయం సాధించడం దర్శకుడు, రచయితకు కూడా అవసరమే. ఎందుకంటే మెగాస్టార్ కే నచ్చిన కథంటే ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ రావు రమేష్ కు దక్కడమంటే మాములు విషయం కాదుగా.
This post was last modified on May 7, 2024 3:36 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…