రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న టైంలో ఊరిపేరు భైరవకోన సక్సెస్ సందీప్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పైగా ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు తనతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంచి సబ్జెక్టులు పడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న ఈ కథ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఒకప్పుడు చిరంజీవికి చెప్పి ఒప్పించిందే. కాకపోతే పట్టాలెక్కలేదు.
ఇకపోతే దీనికి సంబంధించిన ఒక లీక్ ఆసక్తికరంగా ఉంది. దాని ప్రకారం సందీప్ కిషన్ తండ్రిగా నటిస్తున్న రావు రమేష్ పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుందట. అంటే వయసొచ్చిన కొడుకు ఉన్నా సరే రొమాంటిక్ టచ్ పెట్టి అతనికో ప్రియురాలని సెట్ చేస్తున్నట్టు తెలిసింది.
ఆమె ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున మన్మథుడు, ప్రభాస్ రాఘవేంద్రలో హీరోయిన్ గా నటించిన అన్షు. ముందు ప్రియమణి, మధుబాల లాంటి ఆప్షన్లు చూశారు కానీ స్టోరీ వినగానే అన్షు సానుకూలంగా స్పందించడంతో అధికారికంగా ఓకే అనుకున్నాక దీని కోసమే ఆవిడను విదేశాల నుంచి తీసుకొస్తారట.
ఎక్కువ మామా అల్లుళ్ళ డ్రామాలతో నవ్వించే త్రినాధరావు నక్కిన ప్రసన్నల జంట ఈసారి రూటు మార్చిందని మాట. సందీప్ కిషన్ జోడి ఇంకా లాక్ కాలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ చలాకిగా చేసే అమ్మాయి అవసరం కావడంతో కొత్త టాలెంట్ ని వెతుకుతున్నారని ఇన్ సైడ్ టాక్.
కేవలం హీరోకే కాదు ఇది ఘనవిజయం సాధించడం దర్శకుడు, రచయితకు కూడా అవసరమే. ఎందుకంటే మెగాస్టార్ కే నచ్చిన కథంటే ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ రావు రమేష్ కు దక్కడమంటే మాములు విషయం కాదుగా.
This post was last modified on May 7, 2024 3:36 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…