Movie News

నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా రోహిత్ హీరోగా టీవీ5 మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ గత నెల చివరి వారంలోనే రిలీజ్ లాక్ చేసుకుని సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా వేసుకుంది. సరే అయిందేదో అయ్యిందని సదరు అధికారులు చెప్పిన అభ్యంతరాలను సరిచేసి దానికి తగ్గట్టు క్లియరెన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. చాలా తక్కువ సమయం ఉండటం వల్ల ప్రమోషన్లకు సైతం ఇబ్బందే.

నారా రోహిత్ టిడిపి తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడీ ప్రతినిధి 2 కోసం ఏమైనా చేయాలంటే వెంటనే హైదరాబాద్ తిరిగి రావాలి. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను ఇప్పుడు వదులుతున్నారు కానీ వాటితో ఏ మేరకు పనవుతోందో చెప్పలేం. ఎన్నికల పోలింగ్ మే 13 జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడైతేనే వర్కౌట్ అవుతుందనేది నిర్మాతల ఆలోచన. కానీ జనాలు అంత సులభంగా థియేటర్లకు రావడం లేదు. పైగా ఓట్లేసే హడావిడి అంత దగ్గరగా ఉన్నప్పుడు సహజంగానే సినిమాల మీద అంత ఆసక్తి ఉండదు. ఇదంతా ఆలోచించుకోవాల్సిన విషయమే.

ప్రస్తుతానికి ప్రతినిధి 2 మే 10 రావడంలో ఎలాంటి మార్పు లేదు కానీ చివరి నిమిషంలో ఏదైనా జరుగుతుందేమో చూడాలి. ట్రైలర్ నుంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సోషల్ మెసేజ్ మూవీలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయనేది ఇన్ సైడ్ టాక్. కాకపోతే నేరుగా ఎవరినో ప్రస్తావించేలా కాకుండా సున్నితంగా టచ్ చేశారని అంటున్నారు. బహుశా సెన్సార్ ఆలస్యానికి ఇది కూడా కారణం అయ్యుండొచ్చు. గత రెండు మూడు నెలల్లో వచ్చిన రాజకీయ అజెండా సినిమాలన్నీ ఫెయిలైన తరుణంలో ఈ ప్రతినిధి 2 ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది.

This post was last modified on May 7, 2024 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago