‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ఇదే అంటే అతిశయోక్తి కాదు. మామూలుగా వెబ్ సిరీస్లు ఎక్కువగా యూత్ చూస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని అవి పెద్దగా ఆకర్షించలేదు. ఇందుక్కారణం వెబ్ సిరీస్లు ఎక్కువగా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కడం, బోల్డ్నెస్ ఎక్కువ ఉండటం. ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్’ మాత్రం ఇందుకు మినహాయింపు. అది అందరూ చూసి ఎంజాయ్ చేసేలా నీట్గా ఉంటుంది. పైగా ఫ్యామిలీ డ్రామా కూడా అందులో హైలైట్. అందుకే ఈ సిరీస్కు ఎక్కువ ఆదరణ లభించింది.
ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యాక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ 2021 జూన్లో సెకండ్ సీజన్ను రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్న సెకండ్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అప్పట్నుంచి ఫ్యామిలీ మ్యాన్-3 కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఫ్యామిలీ మ్యాన్-3 సెట్స్ మీదికి వెళ్లడంలో చాలా ఆలస్యం జరగడంతో దీని గురించే మరిచిపోయారు అభిమానులు. ఐతే ఎట్టకేలకు మూడో సీజన్ షూట్ మొదలైంది. ఈ విషయాన్ని టీం అధికారికంగా ప్రకటించింది. మూడో సీజన్లోనూ లీడ్ రోల్ చేస్తున్న మనోజ్ బాజ్పేయ్ ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్ సృష్టికర్తలైన రాజ్-డీకేలే మూడో సీజన్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఫ్యామిలీ మ్యాన్-3 ఇండియా మీద చైనా ఎటాక్ చేసే బ్యాక్ డ్రాప్లో నడుస్తుందని రెండో సీజన్ చివర్లోనే హింట్ ఇచ్చారు. ఈ సిరీస్ ఈశాన్య భారత నేపథ్యంలో సాగుతుంది. అక్కడే చిత్రీకరణ కూడా జరుగుతోంది. అమేజాన్ ప్రైమ్ వాళ్లే ఈ సీజన్ను కూడా స్ట్రీమ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫ్యామిలీ మ్యాన్-3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
This post was last modified on May 7, 2024 6:15 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…