మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం అరుదు. అందులోనూ ఓటిటి ట్రెండ్ లో పేరున్న క్యాస్టింగ్ ఉంటేనే ఓపెనింగ్స్ గ్యారెంటీ లేని రోజుల్లో ఇలాంటి సాహసాలు చేసే నిర్మాతలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఇద్దరు విలక్షణ నటులు సోలో హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొదటి వ్యక్తి అజయ్ ఘోష్. ఈ నెల 31 విడుదల కాబోతున్న మ్యూజిక్ షాప్ మూర్తిలో ఈయనదే టైటిల్ రోల్. చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది.
విలన్ గా, సహాయ నటుడిగా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్న అజయ్ ఘోష్ సోలోగా ఆ మధ్య దోచేవారెవరురా లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు కానీ అవి సూపర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ మ్యూజిక్ షాప్ మూర్తి కంటెంట్ పరంగా పాజిటివ్ వైబ్స్ చూపిస్తోంది. జనాన్ని టికెట్లు కొనేలా చేస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం కానీ ఆసక్తి రేపడానికి టీమ్ వెరైటీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇక రెండో మనిషి రావు రమేష్. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకా డేట్ ఖరారు చేయలేదు కానీ టైటిల్ రోల్ ఈయనదే. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.
గతంలో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు చేసిన సినిమాలు పెద్ద హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దాసరి గారిని ఉదాహరణగా తీసుకుంటే సూరిగాడు, పోలీస్ వెంకటస్వామి, లంచావతారం లాంటివి భారీ విజయాలు సాధించాయి. రావు రమేష్ తండ్రి రావుగోపాల్ రావు టైటిల్ రోల్ చేసిన మా ఊళ్ళో మహాశివుడుని నిర్మించింది అల్లు అరవింద్. కాకపోతే అప్పటికి ఇప్పటికి బాక్సాఫీస్ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి కాబట్టి ఈ తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. మరి అజయ్ ఘోష్, రావు రమేష్ లు ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on May 6, 2024 6:00 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…