మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం అరుదు. అందులోనూ ఓటిటి ట్రెండ్ లో పేరున్న క్యాస్టింగ్ ఉంటేనే ఓపెనింగ్స్ గ్యారెంటీ లేని రోజుల్లో ఇలాంటి సాహసాలు చేసే నిర్మాతలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఇద్దరు విలక్షణ నటులు సోలో హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొదటి వ్యక్తి అజయ్ ఘోష్. ఈ నెల 31 విడుదల కాబోతున్న మ్యూజిక్ షాప్ మూర్తిలో ఈయనదే టైటిల్ రోల్. చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది.
విలన్ గా, సహాయ నటుడిగా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్న అజయ్ ఘోష్ సోలోగా ఆ మధ్య దోచేవారెవరురా లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు కానీ అవి సూపర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ మ్యూజిక్ షాప్ మూర్తి కంటెంట్ పరంగా పాజిటివ్ వైబ్స్ చూపిస్తోంది. జనాన్ని టికెట్లు కొనేలా చేస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం కానీ ఆసక్తి రేపడానికి టీమ్ వెరైటీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇక రెండో మనిషి రావు రమేష్. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకా డేట్ ఖరారు చేయలేదు కానీ టైటిల్ రోల్ ఈయనదే. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.
గతంలో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు చేసిన సినిమాలు పెద్ద హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దాసరి గారిని ఉదాహరణగా తీసుకుంటే సూరిగాడు, పోలీస్ వెంకటస్వామి, లంచావతారం లాంటివి భారీ విజయాలు సాధించాయి. రావు రమేష్ తండ్రి రావుగోపాల్ రావు టైటిల్ రోల్ చేసిన మా ఊళ్ళో మహాశివుడుని నిర్మించింది అల్లు అరవింద్. కాకపోతే అప్పటికి ఇప్పటికి బాక్సాఫీస్ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి కాబట్టి ఈ తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. మరి అజయ్ ఘోష్, రావు రమేష్ లు ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…