మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం అరుదు. అందులోనూ ఓటిటి ట్రెండ్ లో పేరున్న క్యాస్టింగ్ ఉంటేనే ఓపెనింగ్స్ గ్యారెంటీ లేని రోజుల్లో ఇలాంటి సాహసాలు చేసే నిర్మాతలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఇద్దరు విలక్షణ నటులు సోలో హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొదటి వ్యక్తి అజయ్ ఘోష్. ఈ నెల 31 విడుదల కాబోతున్న మ్యూజిక్ షాప్ మూర్తిలో ఈయనదే టైటిల్ రోల్. చాందిని చౌదరి కీలక పాత్ర పోషించింది.
విలన్ గా, సహాయ నటుడిగా ఎన్నో సూపర్ హిట్స్ లో భాగం పంచుకున్న అజయ్ ఘోష్ సోలోగా ఆ మధ్య దోచేవారెవరురా లాంటి ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు కానీ అవి సూపర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ మ్యూజిక్ షాప్ మూర్తి కంటెంట్ పరంగా పాజిటివ్ వైబ్స్ చూపిస్తోంది. జనాన్ని టికెట్లు కొనేలా చేస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం కానీ ఆసక్తి రేపడానికి టీమ్ వెరైటీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇక రెండో మనిషి రావు రమేష్. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకా డేట్ ఖరారు చేయలేదు కానీ టైటిల్ రోల్ ఈయనదే. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.
గతంలో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు చేసిన సినిమాలు పెద్ద హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దాసరి గారిని ఉదాహరణగా తీసుకుంటే సూరిగాడు, పోలీస్ వెంకటస్వామి, లంచావతారం లాంటివి భారీ విజయాలు సాధించాయి. రావు రమేష్ తండ్రి రావుగోపాల్ రావు టైటిల్ రోల్ చేసిన మా ఊళ్ళో మహాశివుడుని నిర్మించింది అల్లు అరవింద్. కాకపోతే అప్పటికి ఇప్పటికి బాక్సాఫీస్ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి కాబట్టి ఈ తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభంగా ఉండదు. మరి అజయ్ ఘోష్, రావు రమేష్ లు ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on May 6, 2024 6:00 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…