కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ సంవత్సరం కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. నెంబర్ పరంగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా వేగం ప్రమాదకరం అన్నట్టు క్రమంగా ఈ స్పీడే బ్రేక్ లా మారుతోంది.
ఇటీవలే విడుదలైన ప్రసన్నవదనం గురించి ఎక్కడా నెగటివ్ టాక్ వినిపించలేదు. మిశ్రమ స్పందన అన్నారు తప్పించి బాలేదనే మాట సోషల్ మీడియాలో వినిపించలేదు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని అర్థమైపోతోంది.
దీనికన్నా ముందు వచ్చిన శ్రీరంగనీతులు మరీ అన్యాయం. కనీసం ఇదొకటి వచ్చిందని ప్రేక్షకులు గుర్తించేలోపే మాయమైపోయింది. సోలో హీరో కాకపోయినా సుహాస్ ఫోటోనే హైలైట్ చేసుకుని కాసిన్ని ప్రమోషన్లు చేశారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సైతం బ్లాక్ బస్టర్ కాదు.
డీసెంట్ గా గట్టెక్కింది తప్పించి నిర్మాతలు చెప్పుకున్నట్టు గొప్ప విజయం సాధించలేదు. ఈ ఫలితాలు సుహాస్ కు చేస్తున్న హెచ్చరిక ఒకటే. వేగం తగ్గించాలి. బడ్జెట్ మీద దృష్టి పెట్టాలి. కొందరు నిర్మాతలు మరీ అన్యాయంగా ఖర్చు పెట్టి ప్రొడక్షన్ క్వాలిటీని దెబ్బేయడం నాణ్యతని తగ్గించినట్టు తెరమీద కనిస్తోంది.
దీని వల్ల డైరెక్టర్లతో పాటు సుహాస్ నష్టపోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అన్నట్టు విజయ్ సేతుపతితో పోలిక తెచ్చుకోడం వరకు బాగానే ఉంది కానీ నిజంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే సుహాస్ ఇంకా చాలా కష్టపడాలి.
కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న టైంలో వచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకుంటూ పోతే ఎక్కడో చోట దెబ్బ పడుతుంది. నాని లాగా ఓపెనింగ్స్ గ్యారెంటీ రేంజ్ కు చేరుకోవాలంటే ప్రస్తుత ప్లానింగ్ ఎంత మాత్రం సరిపోదు. కొసమెరుపు ఏంటంటే రాబోయే ఎనిమిది నెలల్లో సుహాస్ సినిమాలు కనీసం నాలుగైదు విడుదల కాబోతున్నాయి.
This post was last modified on May 6, 2024 1:39 pm
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు.…
ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన రెండు వేర్వేరు ప్యాన్ ఇండియా సినిమాలతో గ్రాండ్ టాలీవుడ్…
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…