కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ సంవత్సరం కేవలం నాలుగు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజయ్యాయి. నెంబర్ పరంగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా వేగం ప్రమాదకరం అన్నట్టు క్రమంగా ఈ స్పీడే బ్రేక్ లా మారుతోంది.
ఇటీవలే విడుదలైన ప్రసన్నవదనం గురించి ఎక్కడా నెగటివ్ టాక్ వినిపించలేదు. మిశ్రమ స్పందన అన్నారు తప్పించి బాలేదనే మాట సోషల్ మీడియాలో వినిపించలేదు. తీరా చూస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని అర్థమైపోతోంది.
దీనికన్నా ముందు వచ్చిన శ్రీరంగనీతులు మరీ అన్యాయం. కనీసం ఇదొకటి వచ్చిందని ప్రేక్షకులు గుర్తించేలోపే మాయమైపోయింది. సోలో హీరో కాకపోయినా సుహాస్ ఫోటోనే హైలైట్ చేసుకుని కాసిన్ని ప్రమోషన్లు చేశారు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సైతం బ్లాక్ బస్టర్ కాదు.
డీసెంట్ గా గట్టెక్కింది తప్పించి నిర్మాతలు చెప్పుకున్నట్టు గొప్ప విజయం సాధించలేదు. ఈ ఫలితాలు సుహాస్ కు చేస్తున్న హెచ్చరిక ఒకటే. వేగం తగ్గించాలి. బడ్జెట్ మీద దృష్టి పెట్టాలి. కొందరు నిర్మాతలు మరీ అన్యాయంగా ఖర్చు పెట్టి ప్రొడక్షన్ క్వాలిటీని దెబ్బేయడం నాణ్యతని తగ్గించినట్టు తెరమీద కనిస్తోంది.
దీని వల్ల డైరెక్టర్లతో పాటు సుహాస్ నష్టపోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అన్నట్టు విజయ్ సేతుపతితో పోలిక తెచ్చుకోడం వరకు బాగానే ఉంది కానీ నిజంగా ఆ స్థాయికి చేరుకోవాలంటే సుహాస్ ఇంకా చాలా కష్టపడాలి.
కెరీర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న టైంలో వచ్చిన సినిమాలన్నీ ఒప్పేసుకుంటూ పోతే ఎక్కడో చోట దెబ్బ పడుతుంది. నాని లాగా ఓపెనింగ్స్ గ్యారెంటీ రేంజ్ కు చేరుకోవాలంటే ప్రస్తుత ప్లానింగ్ ఎంత మాత్రం సరిపోదు. కొసమెరుపు ఏంటంటే రాబోయే ఎనిమిది నెలల్లో సుహాస్ సినిమాలు కనీసం నాలుగైదు విడుదల కాబోతున్నాయి.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…