దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి లీడర్ ఉదాహరణ చాలు. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా సమకాలీన రాజకీయ అంశాలను అందులో చూపించిన తీరు దాన్నో కల్ట్ క్లాసిక్ గా మార్చేసింది. వచ్చే వారం మే 9 రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఎపిసోడ్ లో రానా రూలింగ్ పార్టీ మంత్రులకు వందల సంఖ్యలో ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను ఇచ్చే సీన్ బాగా పేలింది. ఇలా నిజంగా జరుగుతుందానే కామెంట్స్ అప్పట్లో చాలా వచ్చాయి. ఇప్పుడది మాములు విషయమైపోయింది.
తాజాగా కుబేరలోనూ శేఖర్ కమ్ముల ఇదే ఫార్ములా వాడబోతున్నాడు. నిన్న వదిలిన నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక కంటైనర్ నిండా డబ్బుంటే వాటిని చూస్తూ వర్షం గొడుగు పట్టుకున్న కింగ్ స్టిల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఎలాంటి పాత్రనే క్లూస్ ఇవ్వకపోయినా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తరహాలో చాలా ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఉంటుందట. చిల్లిగవ్వ లేకుండా తిరిగి లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారే ధనుష్ చీకటి రహస్యాలను వెలికి తీసే అధికారికా నాగ్ ని కొత్తగా చూడబోతున్నారని యూనిట్ లీక్. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచుతోంది.
విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కుబేరని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని నిర్మాతల ఆలోచన. వచ్చే సంక్రాంతికి దింపడం కన్నా పోటీ లేకుండా సోలోగా వచ్చే ఆప్షన్ అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వస్తుందని వాళ్ళ భావన. అయితే ప్రస్తుతానికి ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా ఎన్నో భారీ చిత్రాలు డేట్ల కోసం ప్లాన్ చేసుకున్నాయి. కొన్ని అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రాగా మరికొన్ని అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. కుబేర ఏ స్లాట్ దక్కించుకుంటాడో చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మనీ థ్రిల్లర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
This post was last modified on May 3, 2024 4:50 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…