దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి లీడర్ ఉదాహరణ చాలు. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా సమకాలీన రాజకీయ అంశాలను అందులో చూపించిన తీరు దాన్నో కల్ట్ క్లాసిక్ గా మార్చేసింది. వచ్చే వారం మే 9 రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఎపిసోడ్ లో రానా రూలింగ్ పార్టీ మంత్రులకు వందల సంఖ్యలో ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను ఇచ్చే సీన్ బాగా పేలింది. ఇలా నిజంగా జరుగుతుందానే కామెంట్స్ అప్పట్లో చాలా వచ్చాయి. ఇప్పుడది మాములు విషయమైపోయింది.
తాజాగా కుబేరలోనూ శేఖర్ కమ్ముల ఇదే ఫార్ములా వాడబోతున్నాడు. నిన్న వదిలిన నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక కంటైనర్ నిండా డబ్బుంటే వాటిని చూస్తూ వర్షం గొడుగు పట్టుకున్న కింగ్ స్టిల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఎలాంటి పాత్రనే క్లూస్ ఇవ్వకపోయినా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తరహాలో చాలా ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఉంటుందట. చిల్లిగవ్వ లేకుండా తిరిగి లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారే ధనుష్ చీకటి రహస్యాలను వెలికి తీసే అధికారికా నాగ్ ని కొత్తగా చూడబోతున్నారని యూనిట్ లీక్. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచుతోంది.
విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కుబేరని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని నిర్మాతల ఆలోచన. వచ్చే సంక్రాంతికి దింపడం కన్నా పోటీ లేకుండా సోలోగా వచ్చే ఆప్షన్ అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వస్తుందని వాళ్ళ భావన. అయితే ప్రస్తుతానికి ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా ఎన్నో భారీ చిత్రాలు డేట్ల కోసం ప్లాన్ చేసుకున్నాయి. కొన్ని అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రాగా మరికొన్ని అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. కుబేర ఏ స్లాట్ దక్కించుకుంటాడో చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మనీ థ్రిల్లర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…