నిర్మాణంలో ఉన్న టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల్లో భారీ క్రేజ్ దక్కించుకున్న వాటిలో పుష్ప 2 ది రూల్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పోస్టర్ వచ్చినా చిన్న అప్డేట్ చూసినా అభిమానుల ఎగ్జైట్ మెంట్ తారాస్థాయిలో ఉంటోంది. అలాంటిది మొదటి లిరికల్ వీడియోగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కేవలం ముప్పై సెకండ్ల చిన్న ప్రీ ఆడియోకే సోషల్ మీడియా ఊగిపోయింది. పాజిటివ్ నెగటివ్ రెండు రకాల స్పందనలు మూటగట్టుకుంది. ఇక పూర్తి పాట ఎలా ఉంటుందోననే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ లోనూ విపరీతంగా నెలకొంది.
నకాజ్ అజీజ్, దీపక్ బ్లూ జంట గాత్రంలో పుష్పరాజ్ పాత్ర లక్షణాలను వర్ణిస్తూ ఆస్కార్ విజేత చంద్రబోస్ సమకూర్చిన సాహిత్యం మూడు చరణల్లో మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా సాగింది. నువ్వు గెడ్డం అట్టా సవరిస్తుంటే దేశమే దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడుస్తూ ఉంటే భూమే బద్దలయ్యే అంటూ మొదలుపెట్టి మధ్యలో ఎవరికీ తలవంచకుండా బాస్ లా బ్రతకాలంటే ఎలా ఉండాలో చెబుతూ అమ్మకు దేవుడికి తప్ప ఎవరికీ తలవంచని పుష్ప నైజాన్ని పదాల రూపంలో బయట పెట్టారు. షూ వేసుకుని మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు వెరైటీగా అనిపిస్తాయి.
మొత్తానికి అంచనాలు నిలబెట్టుకోవడంలో మొదటి పాట సక్సెసయిందనే చెప్పాలి. దీనికి కూడా నెగటివ్ రియాక్షన్లు, ఫీడ్ బ్యాక్లు రావొచ్చేమో కానీ వినగా వినగా ఎక్కడం ఖాయమనిపించేలా ఉంది. పుష్ప 1 టైటిల్ సాంగ్ రేంజ్ లో ఉందా అంటే పోలిక పరంగా చెప్పలేం కానీ దేవిశ్రీప్రసాద్ కంపోజింగ్ డిఫరెంట్ గా ఉన్న మాట వాస్తవం. ఎక్కువ విజువల్స్ లేకుండా ఒక స్టెప్పుతో సరిపెట్టిన దర్శకుడు సుకుమార్ పూర్తి వెర్షన్ కోసం కంటెంట్ ఎక్కువ రివీల్ చేయలేదు. తెలుగులో ఓకే అనిపించుకుంది కాబట్టి మిగిలిన భాషల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
This post was last modified on May 1, 2024 5:25 pm
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…