యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్. ముఖ్యంగా ‘గీత గోవిందం’తో అతడి పేరు మార్మోగిపోయింది. విజయ్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ హీరోను పెట్టి వంద కోట్ల సినిమాను డెలివర్ చేయడం అంటే మాటలు కాదు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించనంత పెద్ద విజయం సాధించి పరశురామ్ను టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా మార్చింది.
అరడజనుకు పైగా పేరున్న నిర్మాణ సంస్థలు అతడికి అడ్వాన్సులిచ్చాయి. స్టార్ హీరోలు తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చేసే ఛాన్సొచ్చింది పరశురామ్కు. కానీ మహేష్ అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు పరశురామ్. రిలీజ్ టైంలో అనుకున్న దాని కంటే బెటర్గా ఆడినప్పటికీ అది అంతిమంగా డిజాస్టర్గానే నిలిచింది.
ఈ సినిమా కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు, డైలాగులు ట్రోల్ మెటీరియల్గా మారాయి తర్వాతి రోజుల్లో. ఐతే తర్వాతి చిత్రంతో అయినా తప్పులు సరిదిద్దుకుంటాడనుకుంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ రూపంలో మరింత పేలవమైన సినిమాను అందించాడు. ఈ సినిమా రిలీజ్ టైంలో మామూలుగా అన్ పాపులర్ కాలేదు పరశురామ్. లాజిక్ లెస్ సీన్లు, అర్థరహితమైన డైలాగుల పట్ల తీవ్ర విమర్శలు తప్పలేదు. అప్పుడు అయిన బ్యాండు చాలదన్నట్లు ఇప్పుడు ఓటీటీలో సినిమా రిలీజయ్యాక ఇంకో రౌండ్ పరశురామ్ను ఆడుకుంటున్నారు నెటిజన్లు.
పరశురామ్కు ఇంతకు ముందు కూడా ఫ్లాపులు లేక కాదు కానీ.. ‘ఫ్యామిలీ స్టార్’తో జరిగింది మాత్రం మామూలు డ్యామేజ్ కాదు. ఈ పరిస్థితుల్లో అతను కొత్త దక్కించుకోవడం చాలా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రామ్తో ఓ సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నాడట కానీ.. అతను ఒప్పుకుంటాడా? ఈ సినిమాకు నిర్మాత దొరుకుతారా.. అన్నీ ఓకే అయినా రెండు డిజాస్టర్ల తర్వాత పరశురామ్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుంది.. అన్నదే ప్రశ్నార్థకం.
This post was last modified on April 30, 2024 11:44 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…