మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ ఒకేచోట కలిసేలా నిర్వాహకులు స్వయంగా ఆహ్వానించి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బి స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్ కి ఎవరైనా వెళ్లొచ్చు. కాకపోతే టికెట్లు కొనాలి. 499, 999, 1999 ఇలా మూడు క్యాటగిరీలుగా ధరలు నిర్ణయించి వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని పరిశ్రమకు చెందిన వివిధ సంక్షేమ పధకాల కోసం ఉపయోగించబోతున్నారు. ఊహించని మెరుపులు, సంఘటనలు చాలా ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.
చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాని, తమన్నా, పూజా హెగ్డే ఖచ్చితంగా వచ్చే లిస్టులో ఉన్నారు. ఆ మేరకు అఫీషియల్ బుకింగ్స్ ఇన్ఫోలో ఫోటోలు కూడా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందు వల్ల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు హాజరు కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ఉండటంతో రావడం డౌటే. మహేష్ బాబు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. మీడియం రేంజ్ హీరోల నుంచి పక్కా అనే మెసేజ్ వచ్చాక ఆ వివరాలు అప్డేట్ చేస్తారు. రాజమౌళి, సుకుమార్ లతో మొదలుకుని ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సాయి రాజేష్ దాకా దాదాపు అందరు దర్శకులు అక్కడే ఉంటారు.
ఈ సందర్భంగా డాన్సులు, స్కిట్లతో పాటు దాసరి తీసిన బ్లాక్ బస్టర్స్ నుంచి కొన్ని సన్నివేశాలు, పాటలు రీ క్రియేట్ చేసి వాటిని స్టేజి మీద ప్రదర్శించబోతున్నట్టు తెలిసింది. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు డాన్సులు చేయబోతున్నారట. దాసరి గారిని ఉద్దేశించింది కాబట్టి ఆయన గొప్పదనం హైలైట్ అయ్యేలా పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే ప్లాన్ చేసి ఈ వేడుకకు శాశ్వత గుర్తింపు తేవాలనేది సభ్యుల లక్ష్యం. చూస్తుంటే నెరవేరేలానే ఉంది.
This post was last modified on April 30, 2024 4:02 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…