Movie News

దర్శకుల ఉత్సవంలో ఊహించని మెరుపులు

మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ ఒకేచోట కలిసేలా నిర్వాహకులు స్వయంగా ఆహ్వానించి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బి స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్ కి ఎవరైనా వెళ్లొచ్చు. కాకపోతే టికెట్లు కొనాలి. 499, 999, 1999 ఇలా మూడు క్యాటగిరీలుగా ధరలు నిర్ణయించి వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని పరిశ్రమకు చెందిన వివిధ సంక్షేమ పధకాల కోసం ఉపయోగించబోతున్నారు. ఊహించని మెరుపులు, సంఘటనలు చాలా ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.

చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాని, తమన్నా, పూజా హెగ్డే ఖచ్చితంగా వచ్చే లిస్టులో ఉన్నారు. ఆ మేరకు అఫీషియల్ బుకింగ్స్ ఇన్ఫోలో ఫోటోలు కూడా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందు వల్ల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు హాజరు కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ఉండటంతో రావడం డౌటే. మహేష్ బాబు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. మీడియం రేంజ్ హీరోల నుంచి పక్కా అనే మెసేజ్ వచ్చాక ఆ వివరాలు అప్డేట్ చేస్తారు. రాజమౌళి, సుకుమార్ లతో మొదలుకుని ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సాయి రాజేష్ దాకా దాదాపు అందరు దర్శకులు అక్కడే ఉంటారు.

ఈ సందర్భంగా డాన్సులు, స్కిట్లతో పాటు దాసరి తీసిన బ్లాక్ బస్టర్స్ నుంచి కొన్ని సన్నివేశాలు, పాటలు రీ క్రియేట్ చేసి వాటిని స్టేజి మీద ప్రదర్శించబోతున్నట్టు తెలిసింది. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు డాన్సులు చేయబోతున్నారట. దాసరి గారిని ఉద్దేశించింది కాబట్టి ఆయన గొప్పదనం హైలైట్ అయ్యేలా పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే ప్లాన్ చేసి ఈ వేడుకకు శాశ్వత గుర్తింపు తేవాలనేది సభ్యుల లక్ష్యం. చూస్తుంటే నెరవేరేలానే ఉంది. 

This post was last modified on April 30, 2024 4:02 pm

Share
Show comments

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

5 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

36 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

4 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

5 hours ago