ప్రెస్ మీట్ కావొచ్చు ఇంకేదైనా ప్రమోషనల్ ఈవెంట్ కావొచ్చు సినిమాకు సంబంధించిన నటీనటులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. లేదంటే సోషల్ మీడియా కాలంలో వ్యవహారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరికి అలాంటి అనుభవమే ఎదురవుతోంది. అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించగా ఈమె కీలక పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి వచ్చే నెల విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన టీజర్ కొంచెం కొత్తగా ఉన్న ఫీలింగ్ కలిగించింది. ఈ సందర్భంగా జరిగిన ఒక చిట్ ఛాట్ ప్రోగ్రాంలో చాందిని చౌదరికి ఓ ప్రశ్న ఎదురయ్యింది.
ఐపీఎల్ లో ఎవరికి మద్దతు ఇస్తారని ఓ యువకుడు అడిగాడు. దానికి సమాధానంగా ఇప్పటికీ లైవ్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచులు చూడలేదని, త్వరలో చూస్తానని చెబుతూ తమ ఆంధ్రప్రదేశ్ టీమ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరికీ సపోర్ట్ లేదని చెప్పింది. దానికా అబ్బాయి అదేంటీ హైదరాబాద్ ఉంది కదాని అంటే, మా రాష్ట్రం కాదని చెప్పడం ఎస్ఆర్ హెచ్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. భాగ్యనగరంలో ఉంటూ ఇక్కడే కెరీర్ ని నిర్మించుకుని కనీసం మాట వరసకు మద్దతు తెలుపకపోవడం ఏంటని ఎక్స్ తదితర మాధ్యమాల వేదికగా నిలదీయడం మొదలుపెట్టారు.
నిజానికి ఏపీ తెలంగాణతో సంబంధం లేకుండా తెలుగు వాళ్ళు ఎస్ఆర్ హెచ్ ని ఇష్టపడటం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ ఫ్రాంచైజ్ లేదనే ఫీలింగ్ జనంలో పెద్దగా లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చాందిని చౌదరి మాకు వైజాగ్ లేదా విశాఖపట్నం పేరుతో టీమ్ ఉండాలని అర్థం వచ్చేలా మాట్లడటం చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే గామితో మంచి హిట్ అందుకున్న చాందిని చౌదరి నెక్స్ట్ బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబోలో మూవీలో కీలక పాత్ర దక్కించుకుంది. అందం, టాలెంట్ రెండూ ఉన్న ఈ కలర్ ఫోటో అమ్మాయి ఇప్పటిదాకా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు.
This post was last modified on April 29, 2024 8:16 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…