కీర్తి సురేష్ చిన్న స్థాయి కథానాయికగా ఉన్నపుడు తెలుగులో మొదటగా ఒప్పుకున్న సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా పరిచయం కావాల్సిన సినిమా ఇది. ‘నందిని నర్సింగ్ హోమ్’ కంటే ముందు అతను ఈ సినిమానే మొదలుపెట్టాడు. కీర్తి సైతం తెలుగు తెరకు ఈ చిత్రంతోనే పరిచయం కావాల్సింది. కానీ ‘నేను శైలజ’నే ముందు విడుదలైంది.
‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా అనివార్య కారణాల వల్ల చివరి దశలో ఆగిపోయింది. ఆ తర్వాత అది ఎంతకీ విడుదల కాలేదు. ఈలోపు కీర్తి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు కీర్తి ‘మహానటి’తో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాను ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చి త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా.. దాన్ని పూర్తి చేయడానికి కీర్తి షూటింగ్కు కూడా హాజరు కాబోతోందని, ఇప్పుడు తన స్థాయికి తగని సినిమా అయినా సరే.. తన బాధ్యతగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోందని వార్తలొచ్చాయి. ఐతే జనాల్లో ఏమంత ఆసక్తి లేని ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత విడుదలవడమే గొప్ప అనుకుంటుంటే.. మళ్లీ దాని మీద వివాదం మొదలైంది.
టాలీవుడ్లో వివాదాలకు పెట్టింది పేరైన నట్టి కుమార్ ఈ సినిమాను సీనియర్ నిర్మాత చంటి అడ్డాల విడుదల చేస్తామనని ప్రకటించడం పట్ల అభ్యంతరం చెబుతున్నాడు. చంటి నుంచి ఈ సినిమా హక్కులు ఎప్పుడో కొన్నానని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా తన సొంతమని.. మరి చంటి ఎలా రిలీజ్ చేస్తాడని అతను ప్రశ్నించాడు. మరి ఇలా వివాదం ముసురుకున్న సినిమాను పూర్తి చేయడానికి కీర్తి ముందుకొస్తుందా.. ఈ సినిమా నిజంగా విడుదలవుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.
This post was last modified on September 16, 2020 4:38 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…