Movie News

కీర్తి సినిమా రిలీజే గొప్పంటే.. మళ్లీ వివాదమా?

కీర్తి సురేష్ చిన్న స్థాయి కథానాయికగా ఉన్నపుడు తెలుగులో మొదటగా ఒప్పుకున్న సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా పరిచయం కావాల్సిన సినిమా ఇది. ‘నందిని నర్సింగ్ హోమ్’ కంటే ముందు అతను ఈ సినిమానే మొదలుపెట్టాడు. కీర్తి సైతం తెలుగు తెరకు ఈ చిత్రంతోనే పరిచయం కావాల్సింది. కానీ ‘నేను శైలజ’నే ముందు విడుదలైంది.

‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా అనివార్య కారణాల వల్ల చివరి దశలో ఆగిపోయింది. ఆ తర్వాత అది ఎంతకీ విడుదల కాలేదు. ఈలోపు కీర్తి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు కీర్తి ‘మహానటి’తో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాను ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చి త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా.. దాన్ని పూర్తి చేయడానికి కీర్తి షూటింగ్‌కు కూడా హాజరు కాబోతోందని, ఇప్పుడు తన స్థాయికి తగని సినిమా అయినా సరే.. తన బాధ్యతగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోందని వార్తలొచ్చాయి. ఐతే జనాల్లో ఏమంత ఆసక్తి లేని ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత విడుదలవడమే గొప్ప అనుకుంటుంటే.. మళ్లీ దాని మీద వివాదం మొదలైంది.

టాలీవుడ్లో వివాదాలకు పెట్టింది పేరైన నట్టి కుమార్ ఈ సినిమాను సీనియర్ నిర్మాత చంటి అడ్డాల విడుదల చేస్తామనని ప్రకటించడం పట్ల అభ్యంతరం చెబుతున్నాడు. చంటి నుంచి ఈ సినిమా హక్కులు ఎప్పుడో కొన్నానని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా తన సొంతమని.. మరి చంటి ఎలా రిలీజ్ చేస్తాడని అతను ప్రశ్నించాడు. మరి ఇలా వివాదం ముసురుకున్న సినిమాను పూర్తి చేయడానికి కీర్తి ముందుకొస్తుందా.. ఈ సినిమా నిజంగా విడుదలవుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.

This post was last modified on September 16, 2020 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago