మొదట్లో చిన్న సినిమాలు తీసిన మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’తో తన రేంజ్ మార్చుకున్నాడు. ఆ సినిమాతో భారీ విజయాన్నందుకున్న అతను హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక అప్పట్నుంచి పేరున్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మధ్యలో సీనియర్ హీరో వెంకటేష్ను కూడా డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ వీళ్ల కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత మళ్లీ మీడియం రేంజ్ హీరోలకే పరిమితం అయిపోయాడు. శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్లతో వరుసగా సినిమాలు తీశాడు మారుతి. ఐతే ఇప్పుడు మళ్లీ మారుతి కొంచెం రేంజ్ పెంచి పెద్ద సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్ బేనర్లో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడట.
ఈ చిత్రానికి హీరోగా మాస్ రాజా రవితేజ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ముందు శర్వానంద్ హీరోగా మారుతి తర్వాతి సినిమా అని వార్తలొచ్చాయి కానీ.. తాజా సమాచారం ప్రకారం రవితేజ పేరు వినిపిస్తోంది. మాస్ రాజా సినిమా అంటే కొంచెం పెద్ద రేంజిలోనే ఉంటుంది. మారుతితో అతడి కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. సరైన సినిమా పడితే రవితేజ ఇప్పటికే భలేగా ఎంటర్టైన్ చేయగలడు. ఐతే అతడితో తీస్తే సూట్ కాని కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. లేదంటే మరీ రొటీన్గా లాగిస్తున్నారు.
మారుతిలా రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైనర్ తీసే దర్శకుడు రవితేజను బాగా డీల్ చేయగలడని చెప్పొచ్చు. మరి నిజంగా ఈ సినిమా ఖరారవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ‘క్రాక్’ను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి దాని కంటే ముందే మారుతి సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.
This post was last modified on September 16, 2020 4:37 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…