మొదట్లో చిన్న సినిమాలు తీసిన మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’తో తన రేంజ్ మార్చుకున్నాడు. ఆ సినిమాతో భారీ విజయాన్నందుకున్న అతను హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక అప్పట్నుంచి పేరున్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మధ్యలో సీనియర్ హీరో వెంకటేష్ను కూడా డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ వీళ్ల కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత మళ్లీ మీడియం రేంజ్ హీరోలకే పరిమితం అయిపోయాడు. శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్లతో వరుసగా సినిమాలు తీశాడు మారుతి. ఐతే ఇప్పుడు మళ్లీ మారుతి కొంచెం రేంజ్ పెంచి పెద్ద సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్ బేనర్లో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడట.
ఈ చిత్రానికి హీరోగా మాస్ రాజా రవితేజ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ముందు శర్వానంద్ హీరోగా మారుతి తర్వాతి సినిమా అని వార్తలొచ్చాయి కానీ.. తాజా సమాచారం ప్రకారం రవితేజ పేరు వినిపిస్తోంది. మాస్ రాజా సినిమా అంటే కొంచెం పెద్ద రేంజిలోనే ఉంటుంది. మారుతితో అతడి కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. సరైన సినిమా పడితే రవితేజ ఇప్పటికే భలేగా ఎంటర్టైన్ చేయగలడు. ఐతే అతడితో తీస్తే సూట్ కాని కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. లేదంటే మరీ రొటీన్గా లాగిస్తున్నారు.
మారుతిలా రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైనర్ తీసే దర్శకుడు రవితేజను బాగా డీల్ చేయగలడని చెప్పొచ్చు. మరి నిజంగా ఈ సినిమా ఖరారవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ‘క్రాక్’ను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి దాని కంటే ముందే మారుతి సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…