మొదట్లో చిన్న సినిమాలు తీసిన మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’తో తన రేంజ్ మార్చుకున్నాడు. ఆ సినిమాతో భారీ విజయాన్నందుకున్న అతను హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక అప్పట్నుంచి పేరున్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మధ్యలో సీనియర్ హీరో వెంకటేష్ను కూడా డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ వీళ్ల కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత మళ్లీ మీడియం రేంజ్ హీరోలకే పరిమితం అయిపోయాడు. శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్లతో వరుసగా సినిమాలు తీశాడు మారుతి. ఐతే ఇప్పుడు మళ్లీ మారుతి కొంచెం రేంజ్ పెంచి పెద్ద సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్ బేనర్లో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడట.
ఈ చిత్రానికి హీరోగా మాస్ రాజా రవితేజ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ముందు శర్వానంద్ హీరోగా మారుతి తర్వాతి సినిమా అని వార్తలొచ్చాయి కానీ.. తాజా సమాచారం ప్రకారం రవితేజ పేరు వినిపిస్తోంది. మాస్ రాజా సినిమా అంటే కొంచెం పెద్ద రేంజిలోనే ఉంటుంది. మారుతితో అతడి కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. సరైన సినిమా పడితే రవితేజ ఇప్పటికే భలేగా ఎంటర్టైన్ చేయగలడు. ఐతే అతడితో తీస్తే సూట్ కాని కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. లేదంటే మరీ రొటీన్గా లాగిస్తున్నారు.
మారుతిలా రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైనర్ తీసే దర్శకుడు రవితేజను బాగా డీల్ చేయగలడని చెప్పొచ్చు. మరి నిజంగా ఈ సినిమా ఖరారవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ‘క్రాక్’ను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి దాని కంటే ముందే మారుతి సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.
This post was last modified on September 16, 2020 4:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…