నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సీత లుక్స్ బాగాలేవని ఒక వర్గం కామెంట్ చేస్తుండగా, మరో బ్యాచ్ గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేసే పనిలో పడింది. ఇదంతా ఒక సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే అక్కసుతో వచ్చిందే తప్ప మరొకటి కాదని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కావాలని బురద జల్లడం వల్ల ఏమొస్తుందని నిలదీస్తున్నారు.
ఒకవేళ సాయిపల్లవిని నిజంగానే కామెంట్ చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ రన్బీర్ కపూర్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్స్ పరంగా రాముడిగా అంత నప్పలేదనే ఫీడ్ బ్యాక్ తన మీద వినిపిస్తోంది. అసలు ఎక్కడో దూరంగా కెమెరా పెట్టి తీసిన లీక్డ్ పిక్స్ ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. యూనిట్ భవిష్యత్ లో టీజరో పోస్టరో వదిలినప్పుడు అప్పుడు ఏదైనా అనే హక్కు అందరికీ ఉంటుంది. అలా కాకుండా స్పష్టత లేని ఇమేజెస్ ని తీసుకుని ఇలా నెగటివ్ క్యాంపైన్ చేయడం పట్ల ఫిదా భానుమతి ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరెంత గగ్గోలు పెట్టినా సీతగా సాయిపల్లవి పెర్ఫార్మన్స్ పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆదిపురుష్ లో కృతి సనన్ కన్నా బెటర్ గా ఉంటుందనే మాటని మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయిపల్లవి మొత్తం రెండు సినిమాలతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నాగచైతన్య తండేల్, తమిళంలో శివకార్తికేయన్ అమరన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రామాయణం కోసం రికార్డు స్థాయిలో సాయిపల్లవికి ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త ఆల్రెడీ టాక్ అయ్యింది. నిజమేంటో కానీ నిప్పులేని పొగ ఎందుకొస్తుంది.
This post was last modified on July 7, 2025 11:21 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…