నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సీత లుక్స్ బాగాలేవని ఒక వర్గం కామెంట్ చేస్తుండగా, మరో బ్యాచ్ గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేసే పనిలో పడింది. ఇదంతా ఒక సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే అక్కసుతో వచ్చిందే తప్ప మరొకటి కాదని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కావాలని బురద జల్లడం వల్ల ఏమొస్తుందని నిలదీస్తున్నారు.
ఒకవేళ సాయిపల్లవిని నిజంగానే కామెంట్ చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ రన్బీర్ కపూర్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్స్ పరంగా రాముడిగా అంత నప్పలేదనే ఫీడ్ బ్యాక్ తన మీద వినిపిస్తోంది. అసలు ఎక్కడో దూరంగా కెమెరా పెట్టి తీసిన లీక్డ్ పిక్స్ ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. యూనిట్ భవిష్యత్ లో టీజరో పోస్టరో వదిలినప్పుడు అప్పుడు ఏదైనా అనే హక్కు అందరికీ ఉంటుంది. అలా కాకుండా స్పష్టత లేని ఇమేజెస్ ని తీసుకుని ఇలా నెగటివ్ క్యాంపైన్ చేయడం పట్ల ఫిదా భానుమతి ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరెంత గగ్గోలు పెట్టినా సీతగా సాయిపల్లవి పెర్ఫార్మన్స్ పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆదిపురుష్ లో కృతి సనన్ కన్నా బెటర్ గా ఉంటుందనే మాటని మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయిపల్లవి మొత్తం రెండు సినిమాలతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నాగచైతన్య తండేల్, తమిళంలో శివకార్తికేయన్ అమరన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రామాయణం కోసం రికార్డు స్థాయిలో సాయిపల్లవికి ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త ఆల్రెడీ టాక్ అయ్యింది. నిజమేంటో కానీ నిప్పులేని పొగ ఎందుకొస్తుంది.
This post was last modified on April 28, 2024 4:26 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…