నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సీత లుక్స్ బాగాలేవని ఒక వర్గం కామెంట్ చేస్తుండగా, మరో బ్యాచ్ గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేసే పనిలో పడింది. ఇదంతా ఒక సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే అక్కసుతో వచ్చిందే తప్ప మరొకటి కాదని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కావాలని బురద జల్లడం వల్ల ఏమొస్తుందని నిలదీస్తున్నారు.
ఒకవేళ సాయిపల్లవిని నిజంగానే కామెంట్ చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ రన్బీర్ కపూర్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్స్ పరంగా రాముడిగా అంత నప్పలేదనే ఫీడ్ బ్యాక్ తన మీద వినిపిస్తోంది. అసలు ఎక్కడో దూరంగా కెమెరా పెట్టి తీసిన లీక్డ్ పిక్స్ ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. యూనిట్ భవిష్యత్ లో టీజరో పోస్టరో వదిలినప్పుడు అప్పుడు ఏదైనా అనే హక్కు అందరికీ ఉంటుంది. అలా కాకుండా స్పష్టత లేని ఇమేజెస్ ని తీసుకుని ఇలా నెగటివ్ క్యాంపైన్ చేయడం పట్ల ఫిదా భానుమతి ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరెంత గగ్గోలు పెట్టినా సీతగా సాయిపల్లవి పెర్ఫార్మన్స్ పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆదిపురుష్ లో కృతి సనన్ కన్నా బెటర్ గా ఉంటుందనే మాటని మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయిపల్లవి మొత్తం రెండు సినిమాలతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నాగచైతన్య తండేల్, తమిళంలో శివకార్తికేయన్ అమరన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రామాయణం కోసం రికార్డు స్థాయిలో సాయిపల్లవికి ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త ఆల్రెడీ టాక్ అయ్యింది. నిజమేంటో కానీ నిప్పులేని పొగ ఎందుకొస్తుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…