కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్ 13 విడుదలని లాక్ చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆల్రెడీ లీక్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరికాస్త బలం చేకూరేలా ఒక కీలక అప్డేట్ వచ్చింది.
వచ్చే నెల మే 16 ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. అప్పటికంతా ఎన్నికల వేడి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇండియన్ 2కి బజ్ పెంచడానికి దీన్ని మొదటి మెట్టుగా వాడుకోబోతున్నారు.
అసలు విశేషం ఇది కాదు. ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం దాదాపు ఫిక్సైనట్టేనని చెన్నై మీడియా టాక్. గేమ్ ఛేంజర్ ఎలాగూ దర్శకుడు శంకర్ తీస్తోందే కావడంతో చరణ్ నో చెప్పడమంటూ ఉండదు. పైగా కమల్ వేడుక. ఇక రజనికి రెండు వైపులా బాండింగ్ ఉన్న ఈవెంట్ ఇది.
ప్రాణ స్నేహితుడి, ఒకపక్క ఇంకో వైపు తనకు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇంకోవైపు. ఎందుకు నో చెబుతారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఇద్దరు సీనియర్ దిగ్గజాల మధ్య చరణ్ కనిపించడం కనులపండుగలా ఉంటుంది. సోషల్ మీడియా ఊగిపోతుంది.
అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు. కల్కి ఏడి 2898 డేట్ వచ్చేసింది కానీ దానికి రెండు వారాల కన్నా ముందు వచ్చేలా భారతీయుడు 2 రెడీ అవుతోంది. మే చివరి వారంలో ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ ఉంటుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులు కీలక తారాగణంగా వ్యవహరించిన ఇండియన్ 2కి అనిరుద్ రవిచందర్ ఎలాంటి సంగీతం అందించాడోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
జూన్ లో ఇది వచ్చేస్తుంది కనక గేమ్ ఛేంజర్ చివరి దశ పనులు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర పనులన్నీ చూసుకునే వెసులుబాటు శంకర్ కు దక్కుతుంది.
This post was last modified on April 28, 2024 4:12 pm
ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్’తో గట్టి ఎదురు దెబ్బే తిన్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ 75వ సినిమాగా…
అయ్యో.. రోజాకు ఎంత కష్టమొచ్చింది! అసలే నగరి నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత. పైగా సొంత వైసీపీ నేతలే ఆమె ఓటమి…
టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన…
నిన్న మనం కృష్ణమ్మ, ప్రతినిధి 2, ఆరంభం అంటూ కొత్త రిలీజుల హడావిడిలో పట్టించుకోలేదు కానీ బాలీవుడ్ నుంచి వచ్చిన…
ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వంత…
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్ల…