సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుందనుకుంటే ఇంకొన్ని అడుగులు కిందకు జార్చేయడం ఎప్పటికీ జీర్ణించుకోలేరు.
దీని దెబ్బకే గత సంవత్సరమే ప్రారంభం కావాల్సిన యువి క్రియేషన్స్ సినిమా స్క్రిప్ట్ మెరుగుదల పేరుతో ఆలస్యమవుతూనే ఉంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి సిచువేషన్ చెప్పనక్కర్లేదు. ఏజెంట్ ఫలితం చూశాక కూడా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇచ్చాడు కానీ నిజంగా అది సెట్స్ పైకి వెళ్ళేదాకా నమ్మలేని పరిస్థితి నెలకొంది.
సరే ఇదంతా గతమేలే కానీ ఏజెంట్ ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. సోనీ లివ్ సంస్థ పలుమార్లు ప్రీమియర్ల కోసం డేట్ వేసి చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటూ వస్తోంది. నిర్మాత అనిల్ సుంకరని అడిగితేనేమో హక్కులు అమ్మేశాను కాబట్టి నాకు సంబంధం లేదని చెబుతున్నారు.
పోనీ శాటిలైట్ టెలికాస్ట్ అయినా జరిగిందా అంటే అదీ లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్ వేసిన కేసు వల్లే జాప్యం జరుగుతోందనే సంగతి అర్థమవుతోంది కానీ అసలది పరిష్కారానికి నోచుకుంటుందా లేదా అనేదే అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఫ్యాన్స్ వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది.
డిజాస్టర్ అయ్యింది కాబట్టి ట్రోలింగ్ చేస్తారనే కారణంతో అఖిల్ ఫాన్స్ ఈ ఏజెంట్ లో డిజిటల్ లో రాకపోవడమే మంచిదని కోరుకోవచ్చు. కానీ ఇంతకన్నా దారుణమైన సూపర్ ఫ్లాపులు ఎన్నో అందరు హీరోలు చవిచూశారు. అవన్నీ ఓటిటి, యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.
మంచో చెడో సినిమా ఫలితం ఎలా ఉన్నా దాన్ని చిన్ని తెరపై తీసుకురావడం వల్ల థియేటర్లో మిస్ అయిన కోట్లాది ప్రేక్షకులు కనీసం ఇంట్లో చూసే అవకాశం దక్కుతుంది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే మంచిదే. అన్నట్టు అఖిల్ 6 ని వేసవి పూర్తయ్యాక మొదలుపెట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on April 28, 2024 11:59 am
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే…