ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్ మొదలైపోయాయి. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల గెటప్ లో సరోవరం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్ఫింగ్ అనే అవకాశం లేకుండా ఇమేజ్ స్పష్టంగా ఉండగా దానికి బలం చేకూరేలా షూట్ గ్యాప్ లో రన్బీర్ సగదేహం ఆచ్చాదనా లేకుండా మేకప్ వేసుకుంటున్న స్టిల్ కూడా బయటికి వచ్చేసింది. జంట చూడముచ్చటగా ఉండగా ఇదంతా చూసి నిర్మాణ వర్గాలు షాక్ తిన్నాయి.
క్యాస్టింగ్ కు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దర్శకుడు నితీష్ తివారి గోప్యత పాటిస్తూ ఎక్కువ వివరాలు బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. అయినా సరే క్రమం తప్పకుండ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ తదితరులు ఉన్నారనే లీక్ నెలల నుంచే చక్కర్లు కొడుతోంది. లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి అన్నారు కానీ తను అమెరికాలో ఉండటంతో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. రామాయణం మొత్తం మూడు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పుడు జరుగుతున్నది ఫస్ట్ పార్ట్ తాలూకు చిత్రీకరణ. 2025లో విడుదల ప్లాన్ చేశారు.
ఇందులో యష్ రావణుడిగా నటించడంతో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ వల్ల సుమారు నూటా యాభై కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నట్టు ముంబై మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే యష్ ఎంట్రీ రామాయాణ 2లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా తెరమీద ఎవరూ చూపించినంత గొప్పగా రామాయణం తీస్తానని చెబుతున్న నితీష్ తివారి ఆదిపురుష్ విషయంలో వచ్చిన నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటుకి అవకాశం ఇవ్వనని అంటున్నారు. రన్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.
This post was last modified on July 7, 2025 11:23 pm
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…