Movie News

రామాయణం లీక్స్ మొదలుపెట్టేశారు

ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్ మొదలైపోయాయి. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల గెటప్ లో సరోవరం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్ఫింగ్ అనే అవకాశం లేకుండా ఇమేజ్ స్పష్టంగా ఉండగా దానికి బలం చేకూరేలా షూట్ గ్యాప్ లో రన్బీర్ సగదేహం ఆచ్చాదనా లేకుండా మేకప్ వేసుకుంటున్న స్టిల్ కూడా బయటికి వచ్చేసింది. జంట చూడముచ్చటగా ఉండగా ఇదంతా చూసి నిర్మాణ వర్గాలు షాక్ తిన్నాయి.

క్యాస్టింగ్ కు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. దర్శకుడు నితీష్ తివారి గోప్యత పాటిస్తూ ఎక్కువ వివరాలు బయటికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. అయినా సరే క్రమం తప్పకుండ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ తదితరులు ఉన్నారనే లీక్ నెలల నుంచే చక్కర్లు కొడుతోంది. లక్ష్మణుడిగా నవీన్ పోలిశెట్టి అన్నారు కానీ తను అమెరికాలో ఉండటంతో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. రామాయణం మొత్తం మూడు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పుడు జరుగుతున్నది ఫస్ట్ పార్ట్ తాలూకు చిత్రీకరణ. 2025లో విడుదల ప్లాన్ చేశారు.

ఇందులో యష్ రావణుడిగా నటించడంతో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ వల్ల సుమారు నూటా యాభై కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నట్టు ముంబై మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే యష్ ఎంట్రీ రామాయాణ 2లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటిదాకా తెరమీద ఎవరూ చూపించినంత గొప్పగా రామాయణం తీస్తానని చెబుతున్న నితీష్ తివారి ఆదిపురుష్ విషయంలో వచ్చిన నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటుకి అవకాశం ఇవ్వనని అంటున్నారు. రన్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

This post was last modified on April 27, 2024 1:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

9 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

12 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

12 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

13 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

14 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

15 hours ago