ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. కానీ కొన్ని మాత్రం స్ట్రాటజీ ప్రకారం విడుదల చేసుకుంటే మంచి ఫలితాలు దక్కించుకుంటాయి. వకీల్ సాబ్ అదే చూపించబోతున్నాడు. మే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతోంది ఎస్విసి సంస్థ. ఈ మేరకు దిల్ రాజు బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ బాలీవుడ్ పింక్ రీమేక్ కమర్షియల్ గా మంచి ఫలితం అందుకుంది కానీ పవన్ రేంజ్ లో ఇంకా ఆడాల్సిందని ఫ్యాన్స్ ఫీలవుతూ ఉంటారు.
ఇక టైమింగ్ విషయానికి వస్తే మే ఒకటి నుంచి ఎన్నికల పోలింగ్ కి సరిగ్గా పన్నెండు రోజులు గ్యాప్ ఉంది. అంటే ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉంటుంది. వకీల్ సాబ్ అసలు రిలీజ్ టైంలో ఏపీలో అధికార పార్టీ ఎంతగా ఇబ్బంది పెట్టిందో అభిమానులు మర్చిపోలేదు. టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇవ్వకపోవడం, అదనపు షోలకు నో చెప్పడం తదితరాలన్నీ జరిగాయి. దీని వల్ల కొన్ని ఏరియాల్లో నష్టం కూడా వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని టిడిపి జనసేన నమ్ముతున్న టైంలో వకీల్ సాబ్ వస్తుండటంతో ఖచ్చితంగా ఆ సినిమాకు మద్దతుగా ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతారు.
ఇది సానుకూలంగా వసూళ్లకు పని చేస్తుంది. ఎలాగూ ఆ రోజు రిలీజులు లేవు. మూడో తేదీన నాలుగు వస్తున్నాయి కానీ ఆలోగా వకీల్ సాబ్ తనకిచ్చిన కార్యం నెరవేరుస్తాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. పబ్లిక్ మూడ్ పూర్తిగా రాజకీయాలతో నిండిన సమయంలో జనసేన అధినేత నటించిన సినిమాగా వకీల్ సాబ్ కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. ఓటిటి, ఆన్ లైన్లో దొరికేదే అయినా థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరుగా. పైగా వ్యవస్థ మీద పవన్ ప్రశ్నలు, సెటైర్లు వకీల్ సాబ్ లో బోలెడున్నాయి. ఏ స్థాయిలో వర్కౌట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on April 27, 2024 10:51 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…