ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు కానీ.. థియేటర్లలో వారికి దిమ్మదిరిగే బొమ్మ కనిపించింది.
ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్టని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కుతోందని చిత్ర బృందం ప్రచారం చేసుకుంది కానీ.. రెండోరోజే బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ఈ చిత్రం డిజాస్టర్గా తేలింది. తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. సినిమా రిలీజ్ టైంలో ఫ్యామిలీ స్టార్ మీద సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీని మీద విజయ్ అభిమానులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్గా రిలీజైంది. ఈ సినిమా ఆన్ లైన్లోకి రావడం ఆలస్యం ఇంకో రౌండ్ ట్రోలింగ్ మొదలైంది. సినిమాలోనే అనేక సన్నివేశాలపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రవిబాబుకు విజయ్ వార్నింగ్ ఇచ్చే సీన్లో డైలాగులు.. ఆ సన్నివేశం నడిచే తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. విలన్కు బుద్ధి చెప్పబోయి హీరోనే చీప్ కామెంట్లు చేయడాన్ని తప్పుబడుతున్నారు.
అలాగే యుఎస్లో హీరో డబ్బు కోసం మేల్ ప్రాస్టిట్యూట్గా మారే సీన్ మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఎక్కువగా దర్శకుడు పరశురామ్ ట్రోలర్లకు టార్గెట్గా మారుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్పై ఓటీటీ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో టీం తెలుసుకోకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తోంది.
This post was last modified on April 27, 2024 8:17 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…