జనాలు ఎంత సినిమాల కరువులో ఉన్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. ఇటీవలే తమిళంలో గిల్లి రీ రిలీజైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒక్కడుకి ఇది అఫీషియల్ రీమేక్. వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. బోలెడు సార్లు టీవీలో వచ్చింది. యూట్యూబ్, ఓటిటి రకరకాల మార్గాల్లో అందుబాటులో ఉంది. అయినా సరే ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ మీద దీన్ని చూసే అవకాశం దక్కడంతో యూత్ చూసేయాలని డిసైడయ్యారు. దీంతో ఎగబడి బుకింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. దానికి తోడు టికెట్ రేట్లు అందుబాటు ధరల్లో ఉంచడంతో సీన్ మారిపోయింది.
బుక్ మై షోలో ఏప్రిల్ 15 నుంచి 25 దాకా మొత్తం పది రోజులకు గాను 3 లక్షల 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాస్ 12 కోట్లు దాటేసింది. ఇప్పటిదాకా ఇండియా వైడ్ రీ రిలీజుల్లో ఇదే టాప్ రికార్డు. అలా అని ఇప్పుడేం నెమ్మదించలేదు. రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల ఆన్ లైన్ టికెట్లు బుక్ అవుతూనే ఉన్నాయి. నేరుగా థియేటర్ దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళ సంఖ్య వేరు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొత్త రిలీజులన్నీ ఖాళీ సీట్లతో వెక్కిరిస్తుంటే గిల్లి మాత్రం ఇంత అరాచరం చేయడం విశేషం.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆనందం తట్టుకోలేక నిర్మాత ఏఎం రత్నం వెంటనే విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోయి శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు డిమాండ్ గమనించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నిన్నటి నుంచి రెండు షోలు వస్తే దాదాపు ఫుల్ కావడం గమనార్హం. ఒక్కడుని మ్యాచ్ చేసే రేంజ్ లో గిల్లి లేకపోయినా విజయ్ ఇమేజ్, త్రిష గ్లామర్, విద్యాసాగర్ సంగీతం, చెల్లం అంటూ ప్రకాష్ రాజ్ విలనీ ఇలా ఎన్నో అంశాలు దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మార్చాయి. మొన్న సంవత్సరం మన దగ్గర పోకిరి, ఖుషి, ఒక్కడులో భారీ వసూళ్లు నమోదు చేయడం చూశాంగా.
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…