జనాలు ఎంత సినిమాల కరువులో ఉన్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. ఇటీవలే తమిళంలో గిల్లి రీ రిలీజైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒక్కడుకి ఇది అఫీషియల్ రీమేక్. వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. బోలెడు సార్లు టీవీలో వచ్చింది. యూట్యూబ్, ఓటిటి రకరకాల మార్గాల్లో అందుబాటులో ఉంది. అయినా సరే ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ మీద దీన్ని చూసే అవకాశం దక్కడంతో యూత్ చూసేయాలని డిసైడయ్యారు. దీంతో ఎగబడి బుకింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. దానికి తోడు టికెట్ రేట్లు అందుబాటు ధరల్లో ఉంచడంతో సీన్ మారిపోయింది.
బుక్ మై షోలో ఏప్రిల్ 15 నుంచి 25 దాకా మొత్తం పది రోజులకు గాను 3 లక్షల 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాస్ 12 కోట్లు దాటేసింది. ఇప్పటిదాకా ఇండియా వైడ్ రీ రిలీజుల్లో ఇదే టాప్ రికార్డు. అలా అని ఇప్పుడేం నెమ్మదించలేదు. రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల ఆన్ లైన్ టికెట్లు బుక్ అవుతూనే ఉన్నాయి. నేరుగా థియేటర్ దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళ సంఖ్య వేరు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొత్త రిలీజులన్నీ ఖాళీ సీట్లతో వెక్కిరిస్తుంటే గిల్లి మాత్రం ఇంత అరాచరం చేయడం విశేషం.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆనందం తట్టుకోలేక నిర్మాత ఏఎం రత్నం వెంటనే విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోయి శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు డిమాండ్ గమనించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నిన్నటి నుంచి రెండు షోలు వస్తే దాదాపు ఫుల్ కావడం గమనార్హం. ఒక్కడుని మ్యాచ్ చేసే రేంజ్ లో గిల్లి లేకపోయినా విజయ్ ఇమేజ్, త్రిష గ్లామర్, విద్యాసాగర్ సంగీతం, చెల్లం అంటూ ప్రకాష్ రాజ్ విలనీ ఇలా ఎన్నో అంశాలు దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మార్చాయి. మొన్న సంవత్సరం మన దగ్గర పోకిరి, ఖుషి, ఒక్కడులో భారీ వసూళ్లు నమోదు చేయడం చూశాంగా.
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…