రామ్ గోపాల్ వర్మ నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు బాలీవుడ్లో జెండా ఎగరేసిన టాలీవుడ్ దర్శకుల లిస్ట్ పెద్దదే. వర్మ కంటే ముందు ఆదుర్తి సుబ్బారావు, రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండరీ డైరెక్టర్లు హిందీలో సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఇప్పుడు అక్కడ సందీప్ రెడ్డి హవా నడుస్తోంది. ఇదే సమయంలో మరికొందరు యువ దర్శకుల చూపు బాలీవుడ్ మీద పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, వంశీ పైడిపల్లి.. ఇలా వరుసగా బాలీవుడ్కు వెళ్లే తెలుగు దర్శకుల గురించి వార్తలు వస్తున్నాయి. ఇందులో వంశీ పేరు రెండు రోజులుగా గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వంశీ ఓ హిందీ చిత్రం తీయబోతున్నాడని.. వంశీ సినిమాలు చాలా వరకు తనే నిర్మించిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడని ఓ ప్రచారం నడుస్తోంది. ఐతే ఈ ప్రచారాన్ని వంశీ ఖండించడం గమనార్హం.
ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ ఈ వార్త గురించి అడిగితే.. అది రూమర్ అని తేల్చేశాడు వంశీ. మరి మీ తర్వాతి సినిమా ఏంటి అనంటే.. దాని మీద కసరత్తు జరుగుతోందని.. సరైన సమయంలో ఆ ప్రాజెక్టు గురించి వెల్లడిస్తామని వంశీ తెలిపాడు. వంశీ చివరగా తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వారిసు తీశాడు. మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకున్న ఆ చిత్రం తమిళంలో బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. తర్వాత విజయ్తోనే ఇంకో సినిమా చేయడానికి వంశీ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఇప్పుడు అతడి చూపు బాలీవుడ్ మీద పడిందంటున్నారు. మరి వంశీ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.
This post was last modified on April 26, 2024 10:42 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…