Movie News

బెట్టింగ్ యాప్ కేసులో తమన్నా

ఫిలిం, స్పోర్ట్స్ సెలబ్రెటీలు సినిమాలకు పరిమితం కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు చేయడం కొత్తేమీ కాదు. కానీ తమ ప్రొఫెషన్లో భాగంగా ప్రచారం చేసే క్రమంలో కొన్నిసార్లు ఆయా సంస్థలు చేసే తప్పులకు సెలబ్రెటీలు బాధ్యత వహిచాల్సి ఉంటుంది. గతంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన మోసాలకు సెలబ్రెటీలు కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆమె ప్రచారం చేసి పెట్టిన ఓ బెట్టింగ్ యాప్ నిర్వాకానికి తమన్నా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ యాప్ పేరు.. ఫెయిర్ ప్లే. సామాజిక మాధ్యమాల్లో యువత దృష్టిని కొన్నేళ్లుగా బాగా ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్‌లో ఇది ఒకటి.

ఇండియాలో బెట్టింగ్ చేయడం చట్టవిరుద్ధం అన్న సంగతి తెలిసిందే. ఐతే చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని ఇలాంటి యాప్స్ గేమ్స్ రూపంలో బెట్టింగ్‌ను నడిపిస్తుంటాయి. వీటికి సెలబ్రెటీలు కూడా ప్రచారం చేస్తుంటారు. ఐతే ఫెయిర్ ప్లే యాప్ ఒక అడుగు ముందుకు వేసి.. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను కూడా తమ యాప్‌లో చూడొచ్చని ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో తమన్నా కూడా భాగమైందట.

ఐతే ఐపీఎల్ ఆన్‌లైన్ ప్రసార హక్కులను వేల కోట్లు పోసి కొనుక్కున్న వయాకామ్ 18 సంస్థ ఊరుకుంటుందా? ఫెయిర్ ప్లే మీద కేసు వేసింది. దీంతో ఈ సంస్థకు ప్రచారం చేసిన సెలబ్రెటీలందరినీ పిలిచి ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తమన్నా కూడా విచారణకు హాజరైంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌కు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారట. ఆయన త్వరలోనే విచారణకు హాజరు కానున్నారు.

This post was last modified on April 25, 2024 6:12 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

6 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

8 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

9 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

9 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

10 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

11 hours ago