గత ఏడాది డిసెంబర్ లో విడుదలై భారీ వసూళ్లు సాధించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కి కొనసాగింపు శౌర్యంగపర్వం ఎప్పుడు వస్తుందాని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలుకానప్పటికీ కల్కి 2898 ఏడి రిలీజ్ కాగానే సెట్స్ పైకి వెళ్లొచ్చని బెంగళూరు టాక్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఇది పూర్తి చేస్తే ఆపై జూనియర్ ఎన్టీఆర్ – మైత్రి మూవీ మేకర్స్ పనులకు వెళ్లిపోవచ్చనే దిశగా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలిసింది. ఇది పక్కనపెడితే సలార్ 2కి సంబంధించిన ఒక హాట్ అప్డేట్ క్రేజీగా ఉంది.
మొదటి భాగంలో శృతి హాసన్ ఒక్కర్తే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడీ సీక్వెల్ లో కియారా అద్వానీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అలా అని శృతి స్థానాన్ని తనేమి భర్తీచేయడం లేదు. కథ ప్రకారం ఇంకో అమ్మాయి అవసరం పడటం, అందులోనూ ప్రాధాన్యత ఉన్నది కావడంతో ప్రశాంత్ నీల్ ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో బిజీగా ఉన్న కియారా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లోనూ నటిస్తోంది. ఇప్పుడు సలార్ 2 అంటే ప్రభాస్ జోడి అంటే నో అనే ఛాన్స్ ఉండదు.
ఇది నిర్ధారణగా తెలియడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. సలార్ 1లో మిగిలిపోయిన బోలెడు ప్రశ్నలు, ప్రేక్షకుల్లో కలిగిన కొంత అసంతృప్తి వీటన్నింటికి సమాధానం ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ 2లో చెప్పాలి. ఒకరిద్దరు మినహాయించి మొత్తం క్యాస్టింగ్ రిపీట్ కానుంది. 2025లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు కానీ వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ప్రభాస్ మాత్రం ది రాజా సాబ్ చివరి దశకు రాగానే సలార్ 2కి ఎక్కువ డేట్లు ఇస్తానని చెప్పాడట. స్పిరిట్. హను రాఘవపూడి ప్రాజెక్టులు ఇంకొంచెం టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రణాళికే బెటర్.
This post was last modified on April 25, 2024 3:33 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…