సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందినప్పటి నుంచి బాలవుడ్లో చెడు పోకడల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అక్కడి బడా బాబులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడంతా వారసులదే హవా అని, కొత్త టాలెంట్ను ఎదగనివ్వరని.. ఈ బ్యాచ్ అంతా ఒక మాఫియాలా తయారైందని కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి కూడా అనేక విషయాలు బయటికి వచ్చాయి.
ఆ పరిశ్రమలో మాదక ద్రవ్యాలు తీసుకునే ప్రముఖులు చాలామందే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మూడు నెలలుగా చెడు కారణాలతోనే బాలీవుడ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, నటుడు రవికిషన్.. ఈ అంశాన్ని లేవనెత్తాడు. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారని, విచారణ జరిపితే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయనన్నారు.
ఐతే అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి నటి అయిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అండగా నిలిచే సినీ పరిశ్రమ మీద ఈ అభాండాలేంటని ఆమె ప్రశ్నించారు. ఎవరో కొందరు తప్పు చేస్తే అందరికీ ఆపాదిస్తారా అని ఆమె మండిపడ్డారు. ఈ ప్రసంగం మీద పెద్ద చర్చే నడుస్తోంది నిన్నట్నుంచి. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది.
కంగనా రనౌత్ లాంటి వాళ్లు జయను తీవ్రంగా తప్పుబడితే.. పలువురు సినీ ప్రముఖులు జయను కొనియాడారు. ఐతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకే చెందిన ఎంపీ హేమమాలిని ఆ పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడింది. తమ పార్టీకి చెందిన రవికిషన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. జయకు మద్దతుగా నిలిచింది. తనకు పేరు, డబ్బు, గౌరవం అన్నీ సినిమా పరిశ్రమే ఇచ్చిందని.. అలాంటి పరిశ్రమ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే తాను తట్టుకోలేనని.. జయ వ్యాఖ్యలకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆమె అంది. బాలీవుడ్ ప్రతిష్టను ఊరికే మసకబార్చే ప్రయత్నం చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…