నిన్న విడుదలైన పుష్ప 2 ప్రోమో టైటిల్ సాంగ్ మీద సోషల్ మీడియాలో పాజిటివ్ కన్నా నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా కనిపించడం మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఆ వీడియోలో ఉన్నది కేవలం ఇరవై సెకండ్లే. అది కూడా వరసగా పుష్ప పుష్ప అంటూ కోరస్ లో సింగర్స్ పాడటం తప్ప ఇంకేం లేదు. సాధారణంగా దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ స్లో పాయిజన్ లా ఉంటాయి. గత ఏడాది వాల్తేరు వీరయ్య టైంలో వేరీజ్ ది పార్టీ మీద ఇంత కన్నా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కట్ చేస్తే రిలీజయ్యే లోపు ఆల్బమ్ మొత్తానికే కాదు సినిమా హైలైట్స్ లోనూ ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2కి అదే రిపీట్ అవుతుందనేది దేవి అభిమానుల వెర్షన్. ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఊ అంటావా ఊహూ అంటావా రిలీజైన టైంలోనూ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ కు ఇదంతా అలవాటైన వ్యవహారం. ఒకవేళ పూర్తి లిరికల్ సాంగ్ విన్నాక అప్పుడు ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేయొచ్చు కానీ అసలు పాట మొదటి లైన్ కూడా బయటికి రాకూండానే ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటనేది ఫ్యాన్స్ ప్రశ్న. రకరకాల వీడియోలు, మీమ్స్ ఇప్పటికీ ఆన్ లైన్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
మే 1 రాబోతున్న పుష్ప 2 టైటిల్ సాంగ్ కు వచ్చే అసలు స్పందన సినిమా బజ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించనుంది. దేవి మీద మాములు అంచనాలు లేవు. పుష్ప 1ని మించిన అవుట్ ఫుట్ ఇచ్చాడనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో మాస్ కి ఎంత బాగా నచ్చుతాయనే దాని మీదే హైప్ ఆధారపడి ఉంటుంది. పైగా ఈసారి నార్త్ ఆడియన్స్ కూడా విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అంచనాలను నిలబెట్టుకోవడం కూడా కీలకం. మొత్తం అయిదు పాటలు ఉండొచ్చని తెలిసింది. అన్ని భాషల్లోనూ ఒకేసారి పుష్ప పుష్ప పాట రాబోతోంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…