నిన్న విడుదలైన పుష్ప 2 ప్రోమో టైటిల్ సాంగ్ మీద సోషల్ మీడియాలో పాజిటివ్ కన్నా నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా కనిపించడం మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఆ వీడియోలో ఉన్నది కేవలం ఇరవై సెకండ్లే. అది కూడా వరసగా పుష్ప పుష్ప అంటూ కోరస్ లో సింగర్స్ పాడటం తప్ప ఇంకేం లేదు. సాధారణంగా దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ స్లో పాయిజన్ లా ఉంటాయి. గత ఏడాది వాల్తేరు వీరయ్య టైంలో వేరీజ్ ది పార్టీ మీద ఇంత కన్నా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కట్ చేస్తే రిలీజయ్యే లోపు ఆల్బమ్ మొత్తానికే కాదు సినిమా హైలైట్స్ లోనూ ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2కి అదే రిపీట్ అవుతుందనేది దేవి అభిమానుల వెర్షన్. ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఊ అంటావా ఊహూ అంటావా రిలీజైన టైంలోనూ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ కు ఇదంతా అలవాటైన వ్యవహారం. ఒకవేళ పూర్తి లిరికల్ సాంగ్ విన్నాక అప్పుడు ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేయొచ్చు కానీ అసలు పాట మొదటి లైన్ కూడా బయటికి రాకూండానే ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటనేది ఫ్యాన్స్ ప్రశ్న. రకరకాల వీడియోలు, మీమ్స్ ఇప్పటికీ ఆన్ లైన్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
మే 1 రాబోతున్న పుష్ప 2 టైటిల్ సాంగ్ కు వచ్చే అసలు స్పందన సినిమా బజ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించనుంది. దేవి మీద మాములు అంచనాలు లేవు. పుష్ప 1ని మించిన అవుట్ ఫుట్ ఇచ్చాడనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో మాస్ కి ఎంత బాగా నచ్చుతాయనే దాని మీదే హైప్ ఆధారపడి ఉంటుంది. పైగా ఈసారి నార్త్ ఆడియన్స్ కూడా విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అంచనాలను నిలబెట్టుకోవడం కూడా కీలకం. మొత్తం అయిదు పాటలు ఉండొచ్చని తెలిసింది. అన్ని భాషల్లోనూ ఒకేసారి పుష్ప పుష్ప పాట రాబోతోంది.
This post was last modified on April 25, 2024 11:22 am
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…