Movie News

విశ్వంభరకు రాములమ్మ ‘నో’

ఒకప్పుడు 90 దశకంలో చిరంజీవి – విజయశాంతి బ్లాక్ బస్టర్ పెయిర్. పోటాపోటీగా నటిస్తూ డాన్సులు చేస్తూ ఎన్ని హిట్లు అందుకున్నారో ఠక్కున చెప్పడం కష్టం. వీళ్లిద్దరూ చివరిసారి తెరమీద కనిపించింది 1994 మెకానిక్ అల్లుడులో. అది ఎంత పెద్ద డిజాస్టర్. తర్వాత ఈ కలయిక సాధ్యం కాలేదు. వేర్వేరు పార్టీలు, నేపధ్యాలతో ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో పాటు పలు అభిప్రాయ భేదాలు రావడంతో ఎక్కడా కలుసుకున్న దాఖలాలు కనిపించలేదు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆత్మీయంగా పలకరించుకున్నారు కానీ అది అక్కడికే పరిమితమయ్యింది.

తాజాగా విశ్వంభరలో ఆవిడకో పాత్ర ఆఫర్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రతిపాదన వెళ్లిన మాట నిజమే కానీ ఆవిడ సున్నితంగా నో చెప్పారని ఇన్ సైడ్ టాక్. కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు మెగాస్టార్ జోడిగా ఆడిపాడిన తాను వర్తమానంలో ఆయన త్రిషతో డాన్సులు చేస్తుంటే ఇలా ప్రత్యేక పాత్రకు పరిమితం కావడం బాగుండదని, పైగా తమ జంట ప్రేక్షకుల మనస్సులో ఎలా ముద్రించుకుపోయిందో దాన్ని అలాగే ఉండనివ్వమని చెప్పారట. గతంలో బిగ్ బాస్ లో మాధవి, గ్యాంగ్ లీడర్ లో సుమలత లాంటి వాళ్ళు ఎస్ చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం దక్కని మాట వాస్తవం.

ఇదంతా ఎలా ఉన్నా సరిలేరు నీకెవ్వరు టైంలోనే ఈ ఒక్క సినిమా తప్ప తిరిగి తాను నటించనని విజయశాంతి స్పష్టంగా చెప్పారు. మళ్ళీ నిర్ణయం మార్చుకోవడమంటూ ఉండదని కుండ బద్దలు కొట్టారు. సో చిరునే కాదు భవిష్యత్తులో ఇంకెవరు అడిగినా ఎస్ చెప్పకపోవచ్చు. అసలే తెలంగాణ రూలింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి కీలక సభ్యురాలు. పొలిటికల్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో షూటింగుల్లో బిజీ కావాలనుకోరు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప రాక్షసుడుతో రాములమ్మ కాంబినేషన్ చూడటం దాదాపు అసాధ్యమే.

This post was last modified on April 24, 2024 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago